సౌత్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్. ఆమె రీసెంట్ గా నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. తమిళంలో 'మామన్నన్' సూపర్ డూపర్ హిట్ అందుకోగా, తెలుగులో నటించిన నాని 'దసరా', మహేష్ బాబు  'సర్కారు వారి పాట' సినిమాలు మంచి కమర్షియల్ సక్సెస్ అందుకున్నాయి. ప్రస్తుతం మరికొన్ని సినిమాల్లో నటిస్తోంది.

  


బాలీవుడ్ మూవీ కోసం సరికొత్త లుక్


సౌత్ లో వరుస సినిమాలు చేస్తున్న కీర్తి సురేష్, అటు బాలీవుడ్ లోనూ అడుగు పెట్టింది.  తన తొలి హిందీ మూవీలో వరుణ్ ధావన్‌తో జోడీ కట్టబోతోంది. తమిళ స్టార్ హీరో విజయ్‌ దళపతి నటించిన సూపర్‌ హిట్‌ మూవీ ‘తేరి’ హీందీలోకి రీమేక్ కాబోతోంది. ఇందులో హీరోగా వరుణ్ ధావన్, హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలైనట్లు తెలుస్తోంది. అటు తన తొలి హిందీ సినిమా కోసం కీర్తి సురేష్ సరికొత్తగా మేకోవర్ అయ్యింది. తాజాగా  ఈ ఫోటోను కీర్తి తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసింది. ఈ ఫోటో చూస్తుంటే కొత్త సినిమా కోసం నయా లుక్ లో దర్శనం ఇవ్వబోతున్నట్లు కనిపిస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే మే 31, 2024లో ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్  ప్లాన్ చేస్తున్నారు.


సమంత పాత్రలో కీర్తి, మరి అమీ జాక్సన్ పాత్రలో?   


‘తేరి’ చిత్రం 2016లో విడుదల అయ్యింది. ఇందులో విజయ్ పోలీసు అధికారిగా నటించారు. ఇద్దరు హీరోయిన్లు. ఒకరు సమంత కాగా, మరొకరు అమీ జాక్సన్. హిందీ రీమేక్ లో సమంత పాత్రలో కీర్తి సురేష్ కనిపించనుంది.  అమీ పాత్రకు ఎవరిని ఎంపిక చేస్తారో తెలియాల్సి ఉంది.  ఇక తమిళ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహించగా, హిందీ చిత్రానికి కాలీస్ మెగా ఫోన్ పట్టనున్నారు. ఈ రీమేక్‌ సినిమాను అట్లీ, 'కబీర్ సింగ్' నిర్మాత మురాద్ ఖేతానీతో కలిసి నిర్మించనున్నారు. హిందీ రీమేక్ విషయంలో మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా పలు అంశాల్లో మార్పులు చేర్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.


ఇప్పటికే తెలుగులో సత్తా చాటిన పలువురు హీరోయిన్లు బాలీవుడ్ లో అడుగు పెట్టగా,  ప్రస్తుతం కీర్తి సురేష్ సైతం బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో టాప్ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్న సమంత, రష్మిక మందన్న ఇప్పటికే హిందీ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టారు. నయనతార కూడా ‘జవాన్’ మూవీతో బాలీవుడ్ అరంగేట్రం చేయబోతోంది. ఇప్పుడు కీర్తి సురేష్ కూడా వారి సరసన చేరింది. మరి కీర్తి సురేష్ హిందీలో ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.


వరుస సినిమాల్లో నటిస్తున్న కీర్తి సురేష్   


ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘భోళా శంకర్’ సినిమాలో నటిస్తోంది కీర్తి సురేష్. ఈ సినిమాలో చిరంజీవికి చెల్లిగా కనిపించబోతోంది. ఆగష్టు 11న ఈ సినిమా విడుదల కానున్నది. అటు  'సైరెన్', 'రఘు తాత', 'రివాల్వర్ రీటా', 'కన్నివేడి' లాంటి తమిళ ప్రాజెక్ట్‌లలో కూడా పని చేస్తోంది.


Read Also: అంత ఆటిట్యూడ్‌ మంచిది కాదు - ఆ హీరోపై శోభు యార్లగడ్డ షాకింగ్ కామెంట్స్


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial