ఈ మధ్యకాలంలో కన్నడ ఇండస్ట్రీ నుంచి వస్తోన్న సినిమాలపై జనాలు దృష్టి పడింది. 'కేజీఎఫ్' నుంచి ఈ క్రేజ్ మొదలైంది. రీసెంట్ గా విడుదలైన 'కాంతారా' అనే సినిమా మరో సెన్సేషన్ అయింది. ఈ సినిమాను తెలుగు ఆడియన్స్ కూడా ఎగబడి చూస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ సినిమా దూసుకుపోతుంది. ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీ నుంచి మరో సినిమా రాబోతుంది. ధ్రువ సజ్జా హీరోగా దర్శకుడు ప్రేమ్ ఓ సినిమాను రూపొందిస్తున్నారు. 


ఈ సినిమా టైటిల్ టీజర్ ను విడుదల చేశారు. ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ గా టీజర్ ను కట్ చేశారు. 'రామాయణ యుద్ధం స్త్రీ కోసం.. మహాభారత యుద్ధం రాజ్యం కోసం.. ఈ కలియుగ యుద్ధం కేవలం రక్తం కోసం' అనే డైలాగ్ తో టీజర్ మొదలైంది. ఆ తరువాత కాళీ అనే వ్యక్తి రిలీజ్ అవుతున్నాడని.. పోలీసులు సిటీ మొత్తాన్ని అలెర్ట్ చేయడం, సిటీ లోపలకి అతడు రాకుండా చేయడానికి జాగ్రత్తలు తీసుకోవడం వంటి సన్నివేశాలను చూపించారు. అతడిని చంపడానికి వేల మంది జనాలు రెడీగా ఉన్నారని పోలీసులు అనుకుంటారు. 


కానీ ఆ వ్యక్తిని ఊరేగించడానికి వేల మంది జనాలు జైలు దగ్గరకు తరలివస్తారు. మెల్లగా నిప్పుల మధ్య హీరోను రివీల్ చేస్తూ.. 'ఫీల్డ్ లోకి దిగాక యుద్ధంచేయాల్సిందే.. చస్తే వీరమరణం.. గెలిస్తే సింహాసనం.. యుద్ధం మొదలెడదామా అన్నయ్యా' అంటూ హీరోతో డైలాగ్ చెప్పించారు. అదే సమయంలో 'కేడి' అనే టైటిల్ ను రివీల్ చేశారు. టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. 



ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దానికి తగ్గట్లే సినిమాలో క్యాస్టింగ్ కూడా ఉంది. అయితే నటీనటులను మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. అర్జున్ జన్య ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. విలియం డేవిడ్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. 


1970లలో ఈ సినిమా కథ సాగుతుందని తెలుస్తోంది. కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలకపాత్ర పోషిస్తున్నారు. సినిమాలో ఆయన రోల్ హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. 


Also Read : జిన్నా రివ్యూ: మంచు విష్ణు జిన్నా ప్రేక్షకులను అలరించిందా?