బాలీవుడ్ లో కత్రినా కైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన అందం, అభినయంతో ఇప్పటికీ వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది. బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ ను పెళ్లాడిన కత్రినా.. తన భర్త గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. ఇటీవలే ఈ జంట వివాహం తర్వాత తమ మొదటి దీపావళి పండుగ ను ఘనంగా జరుపుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటో లు నెట్టింట వైరల్ అయ్యాయి కూడా. అయితే, ప్రస్తుతం కత్రినా 'ఫోన్ భూత్' సినిమాలో నటించింది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో కత్రినా బిజీగా వుంది. తన సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న కత్రినా తన భర్త లో తనకు నచ్చిన విషయాలతో పాటు నచ్చని విషయాలను కూడా మొదటిసారిగా బయటపెట్టింది. దీంతో ప్రస్తుతం కత్రినా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.


కత్రినా, విక్కీ కౌశల్ డిసెంబర్ 9, 2021 లో వివాహం చేసుకున్నారు. రాజస్థాన్ లో తమ కుటుంబీకులు, స్నేహితులు మధ్య ఒక్కటయ్యారు ఈ జంట. ఇటీవలే తమ మొదటి దీపావళి వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు కూడా. అయితే  సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఇంటర్వ్యూ లో కత్రినా తన భర్త విక్కీ గురించి కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. తన భర్త కు ఇష్టమైన వాటిల్లో డాన్స్, పాటలు ఒకటి అని చెప్పింది. అతను డాన్స్ చేస్తున్నప్పుడు చాలా సంతోషంగా కనిపిస్తాడని పేర్కొంది. పాటలు కూడా బాగా పాడతాడని వెల్లడించింది. నిజానికి నిజమైన ఆనందం మంచి సంగీతం వలన కూడా కలుగుతుందని అభిప్రాయపడింది. తనకు ఒక్కోసారి నిద్ర పట్టనప్పుడు తన కోసం ఒక పాడాలని విక్కీని అడుగుతానని చెప్పుకొచ్చింది కత్రినా.


అలాగే తనలోని నచ్చని విషయం గురించి అడిగినప్పుడు.. విక్కీ ఒక్కోసారి మొండిగా వ్యవహరిస్తాడని, అది ఒక్కోసారి తనకు చిరాకు కూడా తెప్పిస్తుందని చెప్పింది. కత్రినా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇంటర్వ్యూ రాపిడ్ ఫైర్ లో బాలీవుడ్ లో కొంతమంది స్టార్స్ గురించి అభివర్ణించింది కత్రినా. సల్మాన్ ఖాన్ ఎప్పుడూ సరదాగా ఉంటాడు అని, అలియా భట్ ప్రత్యేకంగా కనిపిస్తుందని. ప్రియాంక స్ఫూర్తిదాయకంగా కనిపిస్తుంది అని తెలిపింది. అయితే, షారుఖ్ ఖాన్‌ తెలివైన వ్యక్తి అని, ఎందుకంటే అతను ఎప్పుడూ కొత్త విషయాలు చెప్తూ ఉంటాడని సమాధానాలిచ్చింది.


ప్రస్తుతం 'ఫోన్ బూత్' సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఇషాన్ ఖట్టర్, సిద్ధాంత్ చతుర్వేది కలిసి నటించిన ఈ హర్రర్ కామెడీ నవంబర్ 4న విడుదల కానుంది. అలాగే కత్రీనా సల్మాన్ ఖాన్‌తో కలిసి రాబోయే యాక్షన్ థ్రిల్లర్ చిత్రం టైగర్ 3లో దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ సరసన మెర్రీ క్రిస్మస్‌లో కూడా కనిపిస్తుంది కత్రినా. మేఘనా గుల్జార్ సామ్ బహదూర్, ఫీల్డ్ మార్షల్ సామ్ మానేక్షా బయోపిక్‌తో సహా అనేక చిత్రాలలో అభిమానులుకు విక్కీ కనిపించనున్నారు. వీటితో పాటు మరికొన్ని సినిమాల్లో నటించనున్నారు విక్కీ. మొత్తంగా విక్కీ కౌశల్ పై కత్రినా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Also Read: 'ఆదిపురుష్' సినిమాకి షాకింగ్ రన్ టైం - మూడు గంటలకు పైగానే!