Karthika Deepam  December 28th  Episode 1548 (కార్తీకదీపం డిసెంబరు 28ఎపిసోడ్)


దీపకు గుండెనొప్పి వచ్చి పడిపోవడంతో హాస్పిటల్ కి తీసుకెళతాడు కార్తీక్. చారుశీలకు ఫోన్ చేస్తాడు. అది విని చారుశీల క్రూరంగా నవ్వుకుంటుంది. 
చారుశీల: నేను అనుకున్నదే జరిగింది ఈ చారుశీల అంచనాలు ఎప్పుడూ తప్పవు అనుకున్న విధంగానే దీపకి హార్ట్ స్టోక్ వచ్చింది. మోనిత మేడం మీరు అనుకున్నది అన్ని సంవత్సరాలుగా చేయలేనిది నేను రెండు రోజుల్లో చేశాను. రెండు రోజుల్లో గుడ్ న్యూస్ చెప్తాను జైల్లో సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీగా ఉండండి అనుకుంటూ ఉంటుంది. 
ఇంతలోనే కార్తీక్ దీపని హాస్పిటల్ కి తీసుకొస్తాడు. అప్పుడు చారుశీల దీపని చెక్ చేస్తూ నేను ఒకేసారి పైకి పంపియచ్చు కానీ నీ మొగుడు డాక్టర్ కదా అందుకే స్లోగా పైకి పంపించేస్తాను అనుకుంటుంది. కార్తీక్ అక్కడికి వచ్చి...మొన్ననే ఆపరేషన్ జరిగింది ఇలా స్ట్రోక్ ఎందుకు వచ్చింది అర్థం కావడం లేదు అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు చారుశీల కావాలనే దీపం ముందు గుండె ఆపరేషన్ కి అన్ని ఏర్పాట్లు అయ్యాయి గుండె దొరుకుతుంది అని మాట్లాడుతుంటుంది.. దీప వింటుంది మాట్లాడొద్దని కార్తీక్ సైగచేస్తాడు..కానీ దీప మత్తులో ఉందని అబద్ధం చెప్పి కావాలనే దీపకు తెలిసేలా కొన్ని రోజుల్లో చనిపోతుందని మాట్లాడుతుంది.
కార్తీక్: నన్ను పెళ్లిచేసుకుని సంతోషంగా ఉన్న రోజులు వేళ్లపై లెక్కపెట్టొచ్చు.. ఓ డాక్టర్ ని అయి ఉండి ఆ మోనిత ఇచ్చిన తప్పుడు రిపోర్ట్స నమ్మాను... తన పిల్లలు నా పిల్లలు కారని అనుమానించి పదేళ్లు దూరం పెట్టాను...
చారుశీల: ఇప్పుడు చేస్తున్నది కూడా అదే కార్తీక్...అప్పుడు మోనిత ఇచ్చిన రిపోర్ట్స్ ని నమ్మావు. ఇప్పుడు నేను ఇచ్చిన రిపోర్ట్స్ నమ్మావు నువ్వు మంచి వాడివి కార్తీక్ అనుకుంటూ ఉంటుంది.
కార్తీక్: యాక్సిడెంట్లో గతం గుర్తు లేక ఎన్నో రోజులు బాధపడ్డాను గతం గుర్తుకు వచ్చిన తర్వాత సంతోషంగా ఉందాము అనుకుంటే తనకు ఇలా జరిగింది . నా దీపను కాపాడుకోవడానికి నా ప్రాణాలు ఇచ్చిన తక్కువే అని కార్తీక్ ఎమోషనల్ అయ్యి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.
చారుశీల: నీ పిచ్చి కాకపోతే దీప మత్తులో లేదు మెలకువ లోనే ఉంది అనుకుంటుంది..అప్పడు దీప కన్నీళ్లు పెట్టుకుంటుంది. 


Also Read: శాడిస్ట్ తండ్రి, సైకో బావ మధ్యలో వసుధార, రిషి ఏం చేయబోతున్నాడు!


సౌందర్య కాఫీ తాగుతూ ఉండగా ఇంతలోనే శౌర్య అక్కడికి వచ్చి కార్తీక్ రాసి ఇచ్చిన మందు స్లిప్పు చూపించడంతో అది చూసి ఇది మీ నాన్న చేతిరాత అయితే ఎవరు రాసిచ్చారు అని సంతోషపడుతుంది. చారుశీల మేడం రాసిచ్చింది అని అంటుంది. అప్పుడు హిమ అక్కడికి వచ్చి  కచ్చితంగా డాడీ చేతిరాతే అని అంటుంది.అప్పుడు శౌర్య అది చారుశీల మేడం ది అనడంతో హిమ కోప్పడి కాదు ఇది కచ్చితంగా డాడీదే అని వాళ్ళిద్దరు పోట్లాడుకుంటారు...
అప్పుడు సౌందర్య..ఇంద్రుడిని పిలిచి నీకు ఎవరిచ్చారని నిలదీస్తుంది. చారుశీల మేడమ్ అని ఇంద్రుడు కవర్ చేయడంతో..  సరే నీతోపని ఉంది పద బయటకు వెళదాం అంటుంది సౌందర్య. అప్పుడు ఇంద్రుడు బయటికి వెళ్లేందుకు రెడీ అవుతుండగా.. చంద్రమ్మ వచ్చి..నీనుంచి నిజం తెలుసుకోవడానికి ఆవిడ తీసుకెళుతోంది అర్థమవుతోందా అంటుంది. 


మరోవైపు దీపని కార్తీక్ ఇంటికి తీసుకెళ్తాడు. నువ్వేం భయపడకు ఇక ఎలాంటి సమస్యలు రావని సర్దిచెప్పేందుకు ప్రయత్నించడంతో దీప అలాగే చూస్తూ ఉంటుంది. 
దీప: హాస్పిటల్ లో జరిగిన డిస్కషన్ గుర్తుచేసుకుని నిజంగా నాకేం కాదా డాక్టర్ బాబు.. హార్ట్ స్టోక్ ఎందుకు వచ్చింది 
కార్తీక్ : అబద్ధాలు చెప్పి కవర్ చేస్తాడు.
దీప: నిన్నటి వరకు మీకు ఏమవుతుందో అని ఈ గుండె కొట్టుకుంది ఈరోజు నా ప్రాణాలే పోతాయని తెలిసిన తర్వాత ఈ గుండె విశ్రాంతి తీసుకుంటుంది కానీ మిమ్మల్ని విడిచి వెళ్లిపోతాను అన్న బాధ ఒకటి మనసులో ఉంది అనుకుంటుంది
ఇంతలో పండరి అక్కడికి నీళ్లు తీసుకొని వస్తుంది. అప్పుడు దీప రేపటి నుంచి నేనే వంట చేస్తాను అనడంతో  కార్తీక్ వద్దు అంటాడు. చేయనివ్వండి సారు భర్తకు ఇలా అవుతుందని తెలిసాక ప్రేమతో వండి పెట్టాలని అనుకుంటుంది కదా అని చెబుతుంది. అప్పుడు వద్దు అని కార్తీక్ గట్టిగా చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు దీప జరిగిన విషయాలు తెలుసుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ నేను ఉన్నన్ని రోజులు నా భర్తను సంతోషంగా చూసుకోవాలి అనుకుంటుంది


Also Read: మోనిత, చారుశీల ప్లాన్ సక్సెస్ - దీపకు గుండెపోటు, హిమ మాటనమ్మని శౌర్య!


ఇంద్రుడు నా దగ్గర ఏదో నిజం దాస్తున్నాడని సౌందర్యకి అనుమానం వస్తుంది. ఇంతలో ఇంద్రుడు అక్కడికి రావడంతో చిన్నప్పటి నుంచి నా కొడుకుని చూస్తున్నాను నా కొడుకుని చేతిరాత నేను గుర్తుపట్టలేనా అనడంతో ఇంద్రుడు టెన్షన్ పడుతూ ఉంటాడు. ఖచ్చితంగా ఆ ప్రిస్క్రిప్షన్ రాసిందే నా కొడుకే అని అంటుంది సౌందర్య. కాకపోతే నాకు ఒక డౌట్ వాళ్ళు మా నుంచి తప్పించుకుని ఎందుకు తిరుగుతున్నారు అని సౌందర్య ప్రశ్నల మీద ప్రశ్నలు వేయడంతో ఇంద్రుడు టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు సౌందర్య ఇంద్రుడు కాలర్ పట్టుకుని నాటకాలు నా దగ్గర ఆడొద్దు నీకు అన్ని విషయాలు తెలుసు అని నాకు తెలుసు ఇప్పుడు ఇంద్రుడు బుకాయిస్తూ పట్టుకుని అడిగినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు బతికి ఉన్నారని ఎలా చెప్పాలి అనడంతో వాళ్లు బతికే ఉన్నారు అని గట్టిగా చెబుతుంది సౌందర్య.


రేపటి( గురువారం) ఎపిసోడ్ లో 
సౌందర్య, ఆనందరావు,పిల్లల్ని చూసి దీప బాధపడుతుంది. మన బతుకు ఇలా ఉందంటని బాధపడుతుంది దీప. మీరు నన్ను వదిలేసి అత్తయ్య వాళ్ల దగ్గరకి వెళ్లిపోండిఅంటుంది... నా ప్రాణాలు పోతాయని మీరు అబద్ధం చెప్పారని నాకు తెలుసు.. అత్తయ్య వాళ్లు వెళ్లిపోతున్నారు వెళ్లండి అని అంటుంది..దీప మాటలు విని కార్తీక్ షాక్ అవుతాడు...