కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సిద్ధార్థ్, బాబీ సింహా నటించిన ‘జిగర్తాండా’ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా ‘జిగర్తాండా డబుల్ ఎక్స్’ అనే సినిమాను కార్తీక్ ప్రకటించాడు. ఇందులో ఎస్‌జే సూర్య, రాఘవ లారెన్స్ నటించనున్నారు. దీనికి సంబంధించిన టైటిల్ టీజర్‌ను కూడా విడుదల చేశారు.


‘జిగర్తాండా’ సినిమా తెలుగులో కూడా రీమేక్ అయింది. ‘గద్దలకొండ గణేష్’ పేరుతో ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. వరుణ్ తేజ్, అధర్వ ఇందులో హీరోలుగా నటించారు. ఈ సినిమా తెలుగులో పెద్ద హిట్ అయింది. 


2014లో విడుదల అయిన ‘జిగర్తాండా’ అప్పట్లో చాలా అవార్డులు కూడా గెలుచుకుంది. నెగిటివ్ రోల్‌లో కనిపించిన బాబీ సింహాకు ఏకంగా జాతీయ అవార్డు కూడా లభించడం విశేషం. ఈ పాత్రను విజయ్ సేతుపతి చేయాల్సిందని కార్తీక్ సుబ్బరాజ్ కూడా చాలా సందర్భాల్లో చెప్పాడు.


‘జిగర్తాండ డబుల్ ఎక్స్’ను స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై కార్తికేయన్ సంతానం, ఎస్.కదిరేశన్ నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. లిరిక్స్‌ను ప్రముఖ రచయత వివేక్ అందిస్తున్నారు. ఫైట్ మాస్టర్‌గా దిలీప్ సుబ్బరాయన్, కొరియోగ్రాఫర్‌గా ఎం.షెరీఫ్ వ్యవహరిస్తున్నారు.