Gopichand Viswam Trailer: గోపీచంద్ (Gopichand) హీరోగా శ్రీను వైట్ల (Sreenu Vaitla) దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ ‘విశ్వం’ (Viswam Trailer). దసరా సందర్భంగా అక్టోబర్ 11వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ‘విశ్వం’ ట్రైలర్‌ను నిర్మాతలు విడుదల చేశారు. ఈ సినిమా ట్రైలర్ ఫుల్ యాక్షన్, కామెడీతో నిండిపోయింది.



హిట్టు అందరికీ కావాలి...
గోపీచంద్ గత కొంతకాలంగా వరుసగా డిజాస్టర్లు వదులుతున్నారు. 2021లో వచ్చిన ‘సీటీమార్’ తర్వాత గోపిచంద్ ఇంతవరకు హిట్టు ముఖం చూడలేదు. ఇక శ్రీను వైట్ల చివరి సినిమా ఏంటో కూడా చాలా మందికి గుర్తుండి ఉండదు. 2018లో వచ్చిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ తర్వాత శ్రీను వైట్ల ఇంతవరకు మరో సినిమా చేయలేదు. మధ్యలో మంచు విష్ణుతో ‘ఢీ’కి సీక్వెల్‌గా ‘డీ అండ్ డీ’ అనే సినిమాను ప్రకటించినా అది పట్టాలెక్కలేదు. ఇప్పుడు గోపిచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్లో వస్తున్న ఫస్ట్ మూవీ 'విశ్వం'. ప్రమోషనల్ కంటెంట్‌తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా అక్టోబర్ 11వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. మరి ఈ మూవీతోనైనా వీరిద్దరి ఖాతాలో హిట్ పడుతుందేమో చూడాలి. ఇదిలా ఉండగా ట్రైలర్‌ను బట్టి చూస్తే ఈ సినిమా టెర్రరిస్టుల నేపథ్యంలో జరిగే కథలా కనిపిస్తుంది. పైగా ఈ సినిమాలో గోపీచంద్ ఒక పవర్ ఫుల్ కమాండోగా కనిపించబోతున్నారని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. సినిమాలో చాలా మంది ఫేమస్ కమెడియన్లు కనిపిస్తున్నారు.


రెండో పాట సూపర్ హిట్
గోపీచంద్ సరసన కావ్య థాపర్ హీరోయిన్‌గా ఈ సినిమాలో ఫస్ట్ సింగిల్ 'మొరాకో మగువకు' అనే పాట ఛార్ట్ బస్టర్ రెస్పాన్స్ తో అదరగొట్టింది. ముఖ్యంగా 'మొండి తల్లి పిల్ల నువ్వు' అంటూ సాగే సెకండ్ సింగిల్ మదర్ ఎమోషన్‌తో అద్భుతంగా ఉంది. ఈ హార్ట్ టచింగ్ సాంగ్‌ను మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ చాలా అద్భుతంగా కంపోజ్ చేశారు. ఈ పాటలో ఉన్న లిరిక్స్ కూడా చాలా హార్ట్ టచింగ్‌ అనేలా ఉన్నాయి. శ్రీ హర్ష ఈమణి ఈ పాటను రాశారు. సాహితి చాగంటి వాయిస్ ఈ పాటను మరో స్థాయికి తీసుకువెళ్లింది అని చెప్పొచ్చు.