ఒకప్పుడు సౌత్ లో హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన జెనీలియా.. ఆ తరువాత పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది. ఆమె సౌత్ లో నటించి దాదాపు పదేళ్లు దాటేసింది. ఇంత లాంగ్ గ్యాప్ తరువాత రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది. పైగా రీఎంట్రీతోనే భారీ రెమ్యునరేషన్ అందుకోబోతుంది. నిజానికి జెనీలియా హీరోయిన్ గా రూ.70 లక్షల రెమ్యునరేషన్ తీసుకునేది. కానీ ఇప్పుడు సపోర్టింగ్ రోల్ కోసం కోట్ల రెమ్యునరేషన్ అందుకోబోతుంది. 


ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు గాలి జనార్దన్ రెడ్డి తన కుమారుడు కిరీటిని హీరోగా పరిచయం చేస్తున్నాడు. శుక్ర‌వారం నాడు ఈ సినిమా ప్రారంభ‌మైంది. తెలుగు క‌న్న‌డ భాష‌ల్లో రూపొందిస్తోన్న ఈ సినిమాకి రాధాకృష్ణ దర్శకత్వం వ‌హిస్తున్నారు. వారాహి చలనచిత్రం ప‌తాకంపై సాయి కొర్ర‌పాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.  


అయితే ఈ సినిమాలో కీలకమైన ఓ రోల్ ఉందట. హీరోకి అక్క క్యారెక్టర్ అని తెలుస్తోంది. దీనికోసం జెనీలియాను సంప్రదించగా.. ఆమె రూ.3 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. నిర్మాతలు ఆమె అడిగినంత ఇవ్వడానికి రెడీ అయ్యారు. మొత్తానికి జెనీలియా తన సెకండ్ ఇన్నింగ్స్ తో భారీ రెమ్యునరేషన్ అందుకొని ఓ కొత్త రికార్డు సెట్ చేస్తోంది.