ఆరడుగుల హీరో గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’గా అతి త్వరలో ప్రేక్షకుల ముందు రావడానికి సిద్ధమైపోతున్నాడు. ముందుగా తన సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను అభిమానుల కోసం వదిలాడు. అందులో మ్యాన్లీగా నడుస్తూ వెళుతున్న గోపీచంద్, అంతే స్టైలిష్ గా ప్రేక్షకులను గురి చూసి కన్నుకొట్టాడు. ఫస్ట్ గ్లింప్స్ లో గోపీ చంద్ బాగానే ఆకట్టుకున్నాడు. త్వరలోనే ట్రైలర్, టీజర్ విడుదల కాబోతున్నాయి. నవంబర్ 8న టీజర్ రానున్నట్టు గ్లింప్స్ వీడియోలో తెలిపారు. వాటిల్లో గోపీచంద్ పాత్ర గురించి తెలిసే అవకాశం ఉంది. అయితే టైటిల్ చూస్తుంటేనే హీరో పాత్ర పక్కా కమర్షియల్ అయ్యుంటాడని అనుమానం వస్తోంది అభిమానులకు.
Also read: ముచ్చటగా ముగ్గురు హీరోయిన్ల శ్యామ్ సింగ రాయ్... ఏ పాత్రలో ఎవరు?


ఈ సినిమా యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. మారుతి దర్శకత్వం వహిస్తుండగా, బన్నీ వాసు, అల్లు అరవింద్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. గోపీచంద్ సరసన రాశీ ఖన్నా నటిస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది మొదట్లోనే ప్రకటించారు. షూటింగ్ మార్చి నుంచి ప్రారంభించారు. దాదాపు ఈ సినిమాను వచ్చే రెండు నెలల్లో విడుదల చేసే అవకాశం ఉంది. కాకపోతే సంక్రాంతి వరకు డేట్లు చాలా టైట్ గా కనిపిస్తున్నాయి. ఎన్నో పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి కనుక, పక్కా కమర్షియల్ విడుదల కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంది. 


ఆయన తాజా సినిమా సీటీమార్ కూడా అంతంతం మాత్రంగానే ఆడింది. కబడ్డీ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద పెద్దగా వసూళ్లు రాబట్టలేకపోయింది. ప్రస్తుతం డీస్నీ హాట్ స్టార్ లో సీటీమార్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో గోపీచంద్, తమన్నా జంటగా నటించారు. భూమిక కీలకపాత్ర పోషించింది.