మెగాఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సాయిధరమ్ తేజ్ తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. తన కెరీర్ లో ఎక్కువగా మాస్, కమర్షియల్ సినిమాలు చేసిన ఈ హీరో తన రూటు మార్చి సరికొత్త కథలతో సినిమాలు చేస్తున్నారు. ఆయన చివరిగా 'రిపబ్లిక్' సినిమాలో కనిపించారు. మధ్యలో యాక్సిడెంట్ అవ్వడంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ సినిమాల జోరు పెంచారు. 


తొలిసారి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తుండడంతో ఈ ప్రాజెక్ట్ కి క్రేజ్ పెరిగింది. ఇప్పుడు ఈ సినిమాకి టైటిల్ ఫిక్స్ చేశారు. అదేంటంటే 'రుద్రవనం'. కథ ప్రకారం.. సినిమాలో రుద్రవనం అనే ఊరు ఉంటుంది. ఆ ఊరిలో ఊహించని విధంగా హత్యలు, ఆత్మహత్యలు జరుగుతుంటాయి. వాటిని హీరో ఎలా ఛేదించాడనే కాన్సెప్ట్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారు. 


నిజానికి ఇలాంటి కాన్సెప్ట్ తో ఇదివరకు చాలా సినిమాలొచ్చాయి. కాకపోతే సాయిధరమ్ తేజ్ తొలిసారి ఇలాంటి జోనర్ లో నటిస్తున్నారు. సుకుమార్ దగ్గర రైటింగ్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన కార్తీక్ దండు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ను అనౌన్స్ చేయనున్నారు.  


Also Read: పెన్ను కదలడం లేదు బావా - 'సుడిగాలి' సుధీర్‌ను తలుచుకుని ఏడ్చిన 'ఆటో' రామ్ ప్రసాద్


Also Read: తిరుమలలో చెప్పులతో - క్షమాపణలు కోరిన నయన్ భర్త విఘ్నేష్, వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందా?