Yash, Shah Rukh Khan To Work Together : 'కేజిఎఫ్' సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు కన్నడ హీరో యశ్. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పటివరకు కన్నడ లో మీడియం రేంజ్ హీరోగా ఉన్న యశ్‌కు 'కేజీఎఫ్' మూవీ నేషనల్ రేంజ్ లో పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఇక ఆ తర్వాత వచ్చిన 'కేజిఎఫ్ 2' ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి యశ్ ని పాన్ ఇండియా స్టార్ చేసింది. ఇక 'కేజిఎఫ్ 2' తర్వాత యశ్ తన కొత్త సినిమాని ప్రకటించేందుకు చాలా టైం తీసుకున్నాడు. రీసెంట్ గానే 'టాక్సిక్' అనే సినిమాని ప్రకటించాడు ఈ కన్నడ హీరో.


గీతూ మోహన్ దాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్ 'రామాయణం' లో యశ్ నటిస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మరో బాలీవుడ్ ప్రాజెక్ట్ కి యశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. 'కేజిఎఫ్' హీరో యశ్ బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ తో కలిసి పనిచేయబోతున్నాడట. షారుక్ సొంత నిర్మాణ సంస్థ అయిన రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ లో యశ్ ఓ ప్రాజెక్టు చేసేందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇందుకోసం చర్చలు కూడా జరుగుతున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందట.


గతంలో ఓ సందర్భంలో యశ్ బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ తో పనిచేయాలని ఉందని తెలిపాడు. ఇక ఇప్పుడు కొత్త ప్రాజెక్టు కోసం షారుక్ ఖాన్ ఓన్ ప్రొడక్షన్ హౌస్ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ తో చర్చలు జరుగుతుండడంతో ఈ ప్రాజెక్టులో షారుక్ ఖాన్ కూడా నటిస్తాడా? అనే అనుమానాలు మొదలయ్యాయి. కాగా యశ్ రెండవ బాలీవుడ్ ప్రాజెక్ట్ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ తోనే ఉండబోతుందని టాక్ కనిపిస్తుంది. అయితే ఈ ప్రాజెక్టులో షారుక్ ఖాన్ నటిస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


ఇక యశ్ 'టాక్సిక్' విషయానికొస్తే.. యశ్ కెరియర్ లో 19వ ప్రాజెక్ట్ అయిన ఈ సినిమా కోసం బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ తో పాటు మరో ఇద్దరు హీరోయిన్స్ ని మూవీ టీం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అంతా అనుకున్నట్టు జరిగితే ఈ సినిమాతోనే కరీనాకపూర్ సౌత్ లోకి ఆరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. గ్లోబల్ డ్రగ్ మాఫియా నేపథ్యంలో తలకెక్కనున్న ఈ సినిమాలో ఎస్ క్యారెక్టర్లేజేషన్ గ్రే షేడ్స్ ని కలిగి ఉంటుందట.


సినిమాలో ముగ్గురు హీరోయిన్లకు ప్రధాన పాత్రలు ఉండడంతో ఆ పాత్రల కోసం కరీనాకపూర్, శృతిహాసన్, సాయి పల్లవి లతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. త్వరలోనే మేకర్స్ నుంచి ఇందుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. కాగా ఈ సినిమాని శ్రీలంక, గోవా, లండన్ లాంటి ప్రాంతాల్లో చిత్రీకరించనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Also Read : ఫిబ్రవరిలో ఏకంగా 10 సినిమాలు విడుదల, ఆ రెండు వెరీ స్పెషల్!