Vishnu Priya Filed Case Against Trollings : యాంకర్ విష్ణుప్రియ మరోసారి వార్తల్లో నిలిచారు. తనను సోషల్ మీడియాలో ట్రోలింగ్స్, వేధిస్తున్న వారిపై పోలీసులకు కంప్లైంట్ చేశారు. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా కామెంట్స్ చేస్తూ తన ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోవే పోరా షో ద్వారా యాంకర్‌గా కెరీర్ మొదలుపెట్టిన విష్ణుప్రియ తక్కువ కాలంలోనే మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.

Continues below advertisement

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనకంటూ స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్నారు. అలా బిగ్ బాస్ హౌస్‌లో ఎంటరయ్యారు. ఆ తర్వాత పలు సినిమాల్లోనూ నటించారు. ప్రస్తుతం వరుస టీవీ షోస్‌తో బిజీగా ఉన్నారు. ఆహాలో సర్కార్ లేటేస్ట్ సీజన్‌కు సుడిగాలి సుధీర్‌తో పాటు కో యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు. రీసెంట్‌గా ఇన్ స్టా సబ్‌స్క్రిప్షన్ పేరుతో విష్ణు ప్రియ ఫోటోస్ షేర్ చేయడం కాంట్రవర్సీగా మారింది. అసభ్యకర ఫోటోస్ షేర్ చేస్తున్నారంటూ నెటిజన్లు ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Continues below advertisement

Also Read : కేన్స్ ఫెస్టివల్‌లో ఐశ్వర్యా రాయ్ - ట్రెండీ లుక్... డ్రెస్ స్పెషాలిటీస్ ఏంటో తెలుసా!

తనను వేధించేలా యూట్యూబ్‌లో వీడియోస్ పోస్ట్ చేస్తున్నారంటూ విష్ణుప్రియ పోలీసులను ఆశ్రయించారు. 4 రోజుల క్రితం మియాపూర్ పీఎస్‌లో కంప్లైంట్ చేయగా కేసు నమోదైంది. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని... ఇకపై ఎవరైనా ఇలా చేస్తే ఇలాగే కేసులు నమోదవుతాయని చెప్పారు. అయితే, విష్ణుప్రియ కేసు పెట్టగానే సదరు యూట్యూబ్ ఛానల్ నుంచి ఆ వీడియో డిలీట్ చేశారు.