Thalapathy Vijay's Final Film Director Finalised : తమిళ అగ్ర హీరో తలపతి విజయ్ ప్రస్తుతం ఫుల్ టైం పాలిటిక్స్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే రాజకీయ ఆరంగేట్రం చేసిన ఈ హీరో కొత్త పార్టీని అధికారికంగా ప్రకటించి 2026 ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు అనౌన్స్ చేసాడు. ఆ లోపు కమిట్ అయిన మూవీస్ ని పూర్తి చేసి ఆ తర్వాత సినిమాలకు విరామం తీసుకుబోతున్నాడు. ప్రస్తుతం వెంకట్ ప్రభు తో 'గోట్' అనే సినిమా చేస్తున్న విజయ్.. దీని తర్వాత ఒకే ఒక్క సినిమా చేయనున్నాడు. గత కొద్ది రోజులుగా ఆయన చివరి సినిమాకి సంబంధించి రకరకాల వార్తలు బయటికి వచ్చాయి. ముఖ్యంగా విజయ్ లాస్ట్ మూవీ కోసం కార్తీక్ సుబ్బరాజ్, త్రివిక్రమ్, గోపీచంద్ మలినేని, వెట్రిమారన్ వంటి దర్శకులు పరిశీలనలో ఉన్నట్లు ఇప్పటికే వార్తలు వినిపించాయి. కానీ వీళ్ళేవరికీ కాకుండా ఆ అవకాశం మరో దర్శకుడికి వచ్చింది. విజయ్ లాస్ట్ మూవీ డైరెక్టర్ దాదాపు కన్ఫర్మ్ అయినట్లు కోలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.


అజిత్ డైరెక్టర్ తో విజయ్ లాస్ట్ మూవీ


దళపతి విజయ్ చివరి సినిమాని కోలీవుడ్ డైరెక్టర్ హెచ్. వినోద్ తెరకెక్కించబోతున్నట్లు తాజా సమాచారం. ఇతను తమిళంలో అజిత్ తో 'నేర్కొండ పార్ వై', 'వాలిమై' వంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కాగా ప్రస్తుతం హెచ్. వినోద్ కమల్ హాసన్ తో ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేశాడు. ఈ మేరకు స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయింది. కానీ కమల్ డేట్స్ ఖాళీ లేకపోవడంతో అదే స్క్రిప్ లో కొన్ని మార్పులు చేర్పులు చేసి తలపతి విజయ్ తో సినిమా చేయాలని భావిస్తున్నాడని టాక్. విజయ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. కంప్లీట్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లోనే ఈ ప్రాజెక్టు ఉండబోతుందని అంటున్నారు. 'గోట్' షూటింగ్ పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్టు ప్రారంభం కానుందట. ఈ సినిమాని పూర్తి చేసి 2026లో జరగనున్న తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై విజయ్ దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. 


జూన్ లో 'గోట్' రిలీజ్ 


టైం ట్రావెలింగ్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న'గోట్' సినిమాలో తలపతి విజయ్ సరసన మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ అయిన పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మలయాళ సీనియర్ నటుడు జయరాం, స్నేహ, లైలా, యోగి బాబు, VTV గణేష్, అజ్మల్ అమీర్, మిక్ మోహన్, ప్రభుదేవా, వైభవ్, అరవింద్ ఆకాష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చెన్నై బ్యూటీ త్రిష కూడా ఓ స్పెషల్ క్యామియో రోల్ చేస్తుందని తెలిసింది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాని జూన్ లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో చెన్నై బ్యూటీ త్రిష కూడా నటిస్తున్నట్లు తెలిసింది.


Also Read : NBA గేమ్స్ లో 'గుంటూరు కారం' క్రేజ్ - కుర్చీ మడతపెట్టి పాటకు అమెరికన్స్ డ్యాన్స్