Vijay Sethupathi Maharaja Movie OTT Release and Streaming Details: తమిళ స్టార్‌ హీరో, విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి ఇటీవల నటించిన చిత్రం 'మహారాజ' . ఇది విజయ్‌ సేతుపతి 50వ చిత్రం కావడం విశేషం. ఇక జూన్‌ 14న థియేటర్‌లోకి వచ్చిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించింది. సస్పెన్స్‌ క్రైం థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. లాంగ్‌ గ్యాప్ తర్వాత విజయ్‌ సేతుపతికి ఈ చిత్రం ఓ సాలిడ్‌ హిట్‌ పడింది. ప్రస్తుతం మహారాజ మూవీ రూ.100 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ దిశగా వెళుతుంది. తెలుగులో ఈ సినిమా మంచి టాక్‌ తెచ్చుకుంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ. 20 కోట్ల వరకు గ్రాస్ చేసిందని సమాచారం. 


దీంతో విజయ్‌ సేతుపతి కెరీర్‌లో తెలుగులో అత్యధిక వసూళ్లు చేసిన తొలి చిత్రంగా 'మహారాజ' నిలిచింది. కానీ, తమిళంలో మాత్రం బ్లాక్‌బస్టర్‌ హిట్‌ టాక్‌తో థియేటర్లో ఇంకా సక్సెఫుల్‌గా దూసుకుపోతుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా డిజిటల్‌ ప్రీమియర్‌కి రెడీ అవుతుందంటూ సోషల్‌ మీడియాలో ఓ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. మహారాజ మూవీ ఓటీటీ రైట్స్‌ ప్రముఖ డిజిటల్‌ ప్లాట్‌ఫాం నెట్‌ప్లిక్స్‌ సొంతం చేసుకుంది. ఫ్యాన్సీ డీల్‌కి ఈ మూవీ అమ్ముడుపోయినట్టు సమాచారం. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి తీసుకువచ్చేందుకు నెట్‌ఫ్లిక్స్‌ ప్లాన్‌ చేస్తుందట. వచ్చేనెల జూలై 19న ఈ మూవీ స్ట్రీమింగ్‌కు రానుందట. తమిళంతో పాటు తెలుగులోనూ అదే రోజుల ఓటీటీలో విడుదల కానుందట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందన సమాచారం. 


'మహారాజ'  కథ
మహారాజ (విజయ్ సేతుపతి) ఓ సామాన్య బార్బర్. తన కూతురితో కలిసి సిటీకి దూరంగా నివసిస్తుంటాడు. అయితే మహారాజ కూతురు జ్యోతి నెలల పసికందుగా ఉన్నప్పుడు అతడి భార్య (దివ్య భారతి) ఓ ప్రమాదంలో మరణిస్తుంది. అయితే ఆ ప్రమాదంలో పాప మాత్రం ప్రాణాలతో బయటపడుతుంది. అయితే ఆమె ప్రాణాలతో ఉండటానికి కారణమైన చెత్త బుట్ట కారణం అవుతుంది. దాంతో అప్పటి నుంచి దానికి లక్ష్మి అని పేరు పెట్టి బాగా మహారాజాను కొంతమంది దొంగలు కొట్టి చెత్త బుట్టను తీసుకువెళతారు.


దాంతో తన కుమార్తె తిరిగి వచ్చేసరికి  ఎలాగైనా లక్ష్మీని(చెత్త బుట్టను) వెతికి పెట్టమని పోలీసు ఫిర్యాదు చేస్తాడు. పోలీసు స్టేషన్‌కి వెళ్లిన మహారాజ పోలీసులతో చెత్త బుట్ట పోయిందని చెప్పేసరికి వారు ఎలా రియాక్ట్ అయ్యారు? ఆ చెత్త బుట్టలో ఏం దాచాడు? ఎలక్ట్రిక్ షాప్ యజమానిగా పగలు మంచివాడిగా నటిస్తున్న సెల్వ(అనురాగ్‌ కశ్వప్‌) రాత్రుళ్లు దొంగతనాలు చేస్తూ ఉంటాడు. అతడి ముఠాకు, మహారాజ ఇంటిలో లక్ష్మీకి దొంగలించడానికి సంబంధం ఏమైనా ఉందా? నిజంగా మహారాజ, లక్ష్మి (చెత్తబుట్ట) కోసమే పోలీసుల దగ్గరకు వెళ్లాడా? మరే కారణమైన ఉందా? తెలియాలంటే సినిమా చూసి  తెలుసుకోవాల్సిందే. 



Also Read: ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ను ఫిక్స్‌ చేసుకున్న సూర్య 'కంగువ' - సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ సినిమాకు పోటీగా..