Vijay Deverakonda-Gowtam Tinnanuri’s film : 'లైగర్' వంటి భారీ డిజాస్టర్ తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ గత ఏడాది 'ఖుషి' మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆడియన్స్ నుంచి ఈ సినిమా పాజిటివ్ టాక్ ని అందుకొని బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. కానీ విజయ్ దేవరకొండకి కావలసిన భారీ కం బ్యాక్ ని ఇవ్వలేకపోయింది. దీంతో ఈసారి ఎలాగైనా భారీ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు విజయ్ దేవరకొండ. ఈ క్రమంలోనే తన తదుపరి చిత్రాన్ని 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్నాడు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాని ప్లాన్ చేశారు. ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసి దాదాపు ఏడాది పూర్తి కావస్తోంది.


ఈ నేపథ్యంలోనే సినిమా గురించి అనేక రూమర్స్ బయటకు వచ్చాయి. ఓ సందర్భంలో అసలు ఈ సినిమా ఉంటుందా? ఉండదా? అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. దానికి తోడు గౌతమ్ తిన్ననూరి ఈమధ్య ఓ చిన్న సినిమా చేస్తున్నారు. దీంతో విజయ్ దేవరకొండ తో ప్రాజెక్టు క్యాన్సిల్ అయిందని వార్త సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను ప్లాన్ చేయగా బడ్జెట్ సమస్యల కారణంగా సినిమాని పక్కన పెట్టే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి. దీంతో పీఆర్ టీం దీనిపై రియాక్ట్ అవుతూ క్లారిటీ ఇచ్చారు. ఈ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని, త్వరలోనే ఈ మూవీ షూటింగ్ మొదలవుతుందని తెలిపారు.


ఇదిలా ఉంటే సినిమాలో విజయ్ దేవరకొండ కానిస్టేబుల్ పాత్రలో కనిపించనున్నాడు. ఓ సాధారణ కానిస్టేబుల్ నుంచి మాఫియా లీడర్ గా ఎదిగిన హీరో కథనే గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాలో చూపించబోతున్నారట. సితార ఎంటర్టైన్మెంట్స్ బాండర్పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. 'VD12' అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి సీక్వెల్ ఐడియాని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీని నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ హక్కులను కొనుగోలు చేసింది.


ప్రస్తుతం విజయ్ దేవరకొండ కెరియర్ చాలా డౌన్ ఫాల్ లో ఉంది. ఫ్యాన్ ఇండియా బ్రాండ్ తో వచ్చిన 'లైగర్' బాక్స్ ఆఫీస్ వద్ద భారీ దెబ్బ కొట్టింది. ఆ తర్వాత వచ్చిన 'ఖుషి' కూడా యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇలాంటి సమయంలో విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్నానూరితో రిస్క్ చేస్తున్నాడనే చెప్పాలి. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ పరశురామ్ దర్శకత్వంలో నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ షూటింగ్ చివరి దశలో ఉంది గీత గోవిందం అంటే బ్లాక్ బస్టర్ తర్వాత వీరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనా నెలకొన్నాయి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.


Also Read : తెలుగులో శివకార్తికేయన్ 'అయలాన్' రిలీజ్ డేట్ ఫిక్స్