KGF Hero Yash Birthday : 'కేజిఎఫ్' సినిమాతో పాన్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ హీరో యశ్ ఈరోజు తన 38వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అభిమానులు ఆయన బర్త్ డేని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ లో అపశృతి చోటు చేసుకుంది. ముగ్గురు అభిమానులు ఎలక్ట్రిక్ షాక్ కి గురై మృతి చెందారు. ఈ వార్త కాస్త కన్నడ నాట కలకలం రేపింది. యశ్ పుట్టినరోజు సందర్భంగా సురంగి అనే గ్రామానికి చెందిన యశ్ అభిమానులు ముగ్గురు ఆదివారం రాత్రి  బర్త్ డే బ్యానర్స్ ఏర్పాటు చేస్తున్నారు. బ్యానర్ కడుతున్న సమయంలో ఎలక్ట్రిక్ షాక్ కి గురయ్యారు.


ఈ ఘటనలో హనుమంత మజ్జురప్ప, హరిజన్ మురళి, నీలప్ప నిడివి మనీ అనే ముగ్గురు అభిమానులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ముగ్గురితో పాటు మరో ముగ్గురికి కూడా షాక్ తగలగా వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం వాళ్లను ఐసీఏలో చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. 25 అడుగుల ఎత్తులో బ్యానర్ ఏర్పాటు చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. యువకుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.


కన్నడలో సీరియల్ నటుడిగా కెరీర్ ని ప్రారంభించిన యశ్ 2007లో 'జంబాడ హుడిగి' సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత వరస విజయాలు అందుకుని కన్నడ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా స్థిరపడ్డారు. 2018లో వచ్చిన 'కేజీఎఫ్ 1', 2022లో వచ్చిన 'కేజీఎఫ్​ 2' సినిమాలు యశ్​ కెరీర్​లో బ్లాక్​ బస్టర్​ హిట్స్​గా నిలిచాయి. దీంతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు.


యశ్ ఈ మధ్యే తన కొత్త సినిమాని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తున్న విషయం తెలిసిందే. యశ్ కెరియర్ లో 19వ ప్రాజెక్ట్ అయిన ఈ చిత్రానికి 'టాక్సిక్ - ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్స్ అప్స్' అనే వెరైటీ టైటిల్ ని ఫిక్స్ చేశారు. గీత మోహన్ దాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా కోసం బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ తో పాటు మరో ఇద్దరు హీరోయిన్స్ ని మూవీ టీం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అంతా అనుకున్నట్టు జరిగితే ఈ సినిమాతోనే కరీనాకపూర్ సౌత్ లోకి ఆరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.


గ్లోబల్ డ్రగ్ మాఫియా నేపథ్యంలో తలకెక్కనున్న ఈ సినిమాలో ఎస్ క్యారెక్టర్లేజేషన్ గ్రే షేడ్స్ ని కలిగి ఉంటుందట సినిమాలో ముగ్గురు హీరోయిన్లకు ప్రధాన పాత్రలు ఉండడంతో ఆ పాత్రల కోసం కరీనాకపూర్, శృతిహాసన్, సాయి పల్లవి లతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. త్వరలోనే మేకర్స్ నుంచి ఇందుకు సంబంధించి ఆఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. కాగా ఈ సినిమాని శ్రీలంక, గోవా, లండన్ లాంటి ప్రాంతాల్లో చిత్రీకరించనున్నారు. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.


Also Read :ఎంగేజ్‌మెంట్‌కు సిద్ధమవుతున్న విజయ్, రష్మిక? త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్?