Teri Baaton Mein Aisa Uljha Jiya: ఈరోజుల్లో సినిమాల్లో బోల్డ్ సీన్స్ అనేవి ఎక్కువయిపోయాయి. ఫ్యామిలీ కథతో వచ్చిన సినిమాల్లో కూడా బోల్డ్ సీన్స్‌ను పెడుతున్నారు మేకర్స్. దాని వల్ల సెన్సార్ బోర్డ్ అయోమయంలో పడుతోంది. కొన్ని సీన్స్‌ను పూర్తిగా తొలగించక తప్పడం లేదు. తాజాగా ఒక హిందీ చిత్రం విషయంలో అదే జరిగింది. సినిమా విడుదలకు ఒకరోజు ముందు ఒక సీన్‌ను తొలగించమని మేకర్స్‌ను ఆదేశించింది సెన్సార్ బోర్డ్. అదే షాహిద్ కపూర్, కృతి సనన్ జంటగా నటించిన ‘తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా’. ఫిబ్రవరీ 9న విడుదలకు సిద్ధమయిన ఈ సినిమాకు ఇప్పుడు సెన్సార్ కష్టాలు ఎదురవుతున్నాయి.


పూర్తిగా తొలగించాలి..


షాహిద్ కపూర్, కృతి సనన్ జంటగా నటించిన ‘తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా’ సినిమాకు చివరి నిమిషంలో మార్పులు చేర్పులు చేసింది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ). ఇందులో హీరో, హీరోయిన్ మధ్య వచ్చే ఒక ఇంటిమేట్ సీన్‌ను పూర్తిగా తొలగించాలని ఆదేశించింది. దీంతో పాటు సినిమాలోని సెకండ్ హాఫ్‌లోని ఒక సీన్‌లో ‘దారు’ అనే పదాన్ని తొలగించి ‘డ్రింక్’ అనే పదాన్ని యాడ్ చేయమని చెప్పిందట సీబీఎఫ్‌సీ. షాహిద్ కపూర్, కృతి సనన్ ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నా.. వీరిద్దరూ ఎప్పుడూ కలిసి నటించలేదు. ‘తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా’ కోసం మొదటిసారి వీరిద్దరూ జతకట్టారు. మొదటి సినిమాతోనే వీరిద్దరూ అదిరిపోయే కెమిస్ట్రీని కనబరిచారని టాక్ వినిపిస్తోంది.


నిడివి తగ్గింది..


‘తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా’లోని కొన్ని ఇంటిమేట్ సీన్స్‌ను తొలగించాలని సీబీఎఫ్‌సీ మరీ మరీ చెప్పిందట. ఇక ఆ సీన్స్‌ను తప్పకుండా తొలగించడంతో మూవీ రన్ టైమ్ కూడా చాలా తగ్గుతుందని సమాచారం. ఒక ఇంటిమేట్ సీన్‌లోని 9 సెకండ్లను తొలగించమని సెన్సార్ బోర్డ్ ఆదేశించిందట. దీంతో మూవీ ఒరిజినల్ రన్ టైమ్‌ 36 సెకండ్ల నుండి 27 సెకండ్లకు తగ్గిపోయింది. దీంతో పాటు స్మోకింగ్ సీన్స్ వచ్చినప్పుడు ధూమపానం హానికరం అని కనిపించే విధంగా వార్నింగ్ ఇవ్వమని సెన్సార్ ఆదేశించినట్టు తెలుస్తోంది. మొత్తంగా సెన్సార్ కట్స్ పూర్తయిన తర్వాత ‘తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా’కు యూ/ఏ సర్టిఫికెట్ దక్కింది. సినిమా రన్ టైమ్ 143.15 నిమిషాలు.. అంటే 2 గంటల 23 నిమిషాల 15 సెకండ్లకు చేరింది.


రోబో, మనిషి మధ్య ప్రేమకథ..


ఒక డిఫరెంట్ లవ్ స్టోరీగా ‘తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా’ ప్రేక్షకుల ముందుకు రానుంది. అమిత్ జోషీ, ఆరాధనా సాహ్ కలిసి ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలయిన పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. చాలాకాలం తర్వాత తనలోని డ్యాన్సర్‌ను బయటకు తీశాడు షాహిద్ కపూర్. తనతో పాటు కృతి సనన్ కూడా పోటీగా డ్యాన్స్ చేసింది. పాటల్లో హీరోహీరోయిన్ కెమిస్ట్రీ బాగుందని ఇప్పటికే ప్రేక్షకులు పాజిటివ్ రివ్యూ ఇస్తున్నారు. ధర్మేంద్ర, డింపుల్ కపాడియా లాంటి సీనియర్ నటీనటులు ఈ మూవీలో ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఇందులో కృతి సనన్ రోబోగా నటించగా.. రోబోకు, మనిషికి మధ్య జరిగే ప్రేమకథగా ‘తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా’ తెరకెక్కింది.


Also Read: ‘బేబీ’ హిందీ రీమేక్‌లో హీరోయిన్ ఫిక్స్ - వైష్ణవి చైతన్య స్థానంలో స్టార్ కిడ్