మిళ నటుడు సతీష్ వివాదంలో ఇరుక్కున్నారు. ఇటీవలే సన్నీ లియోన్ నటించిన తమిళ సినిమా ‘ఓ మై ఘోస్ట్’ ఆడియో లాంచ్‌లో సతీష్ పాల్గొన్నాడు. అదే ఈవెంట్‌కు మరో నటి దర్శ గుప్తా కూడా వచ్చింది. ఈ సందర్భంగా స్టేజీ మీద సతీష్, సన్నీ, దర్శ వేసుకున్న దుస్తులను కంపేర్ చేశారు. ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రోల్ అవుతుంది.


ఈ వీడియోలో సతీష్ మాట్లాడుతూ ‘సన్నీ లియోన్ ముంబై నుంచి వచ్చినా తను వేసుకున్న బట్టలు (చీర) చూడు. ఇంకో అమ్మాయి (దర్శ గుప్తా) కోయంబత్తూరు నుంచే వచ్చినా ఈ అమ్మాయి వేసుకున్న బట్టలు చూడండి.’ అన్నాడు.


దీనిపై సింగర్ చిన్మయి శ్రీపాద ట్విట్టర్‌లో స్పందించారు. ‘సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా దుస్తులు వేసుకోలేదని అంతమంది ముందు కించపరిచేలా మాట్లాడారు. పురుషుల దగ్గర నుంచి ఇలాంటి ప్రవర్తన ఎప్పుడు ఆగుతుంది? ఇవేమీ ఆటలు కాదు.’ అని చిన్మయి ట్వీట్ చేశారు.


‘ఓ మై ఘోస్ట్’ అనేది ఒక హర్రర్ కామెడీ చిత్రం. ఇందులో సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో నటించింది. ‘మాయా సేన’ అనే రాణి పాత్రలో సన్నీ కనిపించనుంది. దీంతో పాటు సన్నీ లియోన్‌ను దెయ్యంలా కూడా చూపించారు. ‘కొన్ని సినిమాలు స్క్రిప్ట్ దశలోనే చాలా నవ్విస్తాయి. కేవలం దాని కోసం మాత్రమే నేను ఈ సినిమాలో నటించాను.’ అని సన్నీ లియోన్ అన్నారు.


‘ఈ సినిమా భయపెడుతూనే నవ్విస్తుంది. ఇది చాలా తెలివైన కాంబినేషన్. ప్రజలను నవ్వించడం చాలా కష్టం. దానికి సంబంధించిన టైమింగ్ కోసం నేను చాలా కష్టపడ్డాను. దీంతో పాటు డిక్షన్ కోచ్‌ను పెట్టుకుని నేను డైలాగ్స్ కూడా నేర్చుకున్నాను. ఇది నాకు ఎంతో ప్రత్యేకమైన సినిమా.’ అని తెలిపారు. యువన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. యోగి బాబు, మొట్ట రాజేంద్రన్, రమేష్ తిలక్, అర్జునన్, తంగ దురైలు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. డి. వీర శక్తి, కే. శశికుమార్ ఈ సినిమాను నిర్మించారు.