Suhas: యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ ఇటీవలే 'రైటర్ పద్మభూషణ్' గా అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా మారిన సుహాస్.. మరో కొత్త చిత్రానికి ఓకే చేశాడు. ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ తాజాగా రివీల్ అయింది. ఈ సందర్భంగా 'శ్రీరంగనీతులు' అనే టైటిల్ అనౌన్స్ మెంట్ పోస్టర్ విడుదలైంది. ఈ సినిమాకు ప్రవీణ్ కుమార్ విఎస్ఎస్ రచన, దర్శకత్వం వహిస్తున్నట్టు హీరో సుహాస్ ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఈ మూవీలో 'కేర్ ఆఫ్ కంచరపాలెం' ఫేమ్ కార్తీక్ రత్నం కూడా ఈ సినిమాలో భాగమవనున్నట్టు తెలుస్తోంది.


'శ్రీరంగనీతులు' అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను రివీల్ చేసిన మేకర్స్.. ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ముగ్గురు యువకులు అటు వైపు తిరిగి.. ఎదురుగా ఉన్న భారీ ఫ్లెక్సీపై పెద్ద పెద్ద అక్షరాలలో రాసిన 'శ్రీరంగనీతులు' అనే టైటిల్ ను చూస్తున్నట్టుగా ఉంది. ఈ టైటిల్ తో పాటు థియేటర్లలోకి త్వరలో రానుందని మేకర్స్ ఈ పోస్టర్ ద్వారా ప్రకటించారు.  టైటిల్ క్యాచీగా ఉండ‌డంతో పాటు ఈ పోస్ట‌ర్ ప్రేక్ష‌కుల్ని ఆకట్టుకుంటోంది. అతి త్వ‌ర‌లో ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయ‌నున్నట్టు సమాచారం. దీన్ని బట్టి చూస్తే సుహాస్ మరోసారి న్యాచురల్ అండ్ ఇంట్రస్టింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తెలుస్తోంది. విరాజ్ అశ్విన్ కీలక పాత్రలో నటిస్తున్న 'శ్రీరంగనీతులు' చిత్రంలో సుహాస్ సరసన రుహాని శర్మ కథానాయికగా నటిస్తోంది. రాధావి ఎంట‌ర్టైన్‌మెంట్స్‌ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా వెంక‌టేశ్వ‌ర‌రావు బ‌ల్మూరి ఈ మూవీని నిర్మిస్తున్నారు. న్యూ ఏజ్ కామెడీ డ్రామాగా తెర‌కెక్కుతోన్న‌ ఈ చిత్రం ద్వారా ప్ర‌వీణ్ కుమార్ వీఎస్ఎస్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మవుతున్నారు. ఈ చిత్రం ప్ర‌స్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని శ‌ర‌వేగంగా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో భాగంగా మేకర్స్ ఈ రోజు టైటిల్ పోస్ట‌ర్ ను విడుద‌ల చేసింది.






`అర్జున్ రెడ్డి ` ఫేమ్  హ‌ర్ష వ‌ర్థ‌న్ రామేశ్వ‌ర్‌, `సేవ్ ది టైగ‌ర్స్` ఫేమ్ అజ‌య్ అర్సాడ సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి టిజో టామి సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. విరాజ్ అశ్విన్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, గీత భాస్క‌ర్‌, శ్రీ‌నివాస్ అవ‌స‌రాల కీల‌క పాత్ర‌ల‌లో క‌నిపించ‌నునున్నారు. ఈ మూవీలో సుహాస్‌ తో పాటు కార్తిక్ ర‌త్నం, రుహాని శ‌ర్మ‌, విరాజ్ అశ్విన్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, గీత భాస్క‌ర్‌, శ్రీ‌నివాస్ అవ‌స‌రాల‌, దేవీ ప్ర‌సాద్, జీవ‌న్ రెడ్డి, సంజ‌య్ స్వ‌రూప్‌, సీవిఎల్ న‌ర‌సింహా రావు తదితరులు నటించనున్నారు.



Read Also: 'అన్నీ మంచి శకునములే' మూవీకి ‘ప్రాజెక్ట్ కె‘ సపోర్ట్ - అడగకుండానే ప్రజలకు సాయం, ఇదిగో వీడియో!



 మొదట కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో నటించి, 2018లో విడుదలైన 'పడి పడి లేచే మనసు' సినిమా ద్వారా సుహాస్ సినీ రంగంలోకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత 'మజిలీ', 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ', 'డియర్ కామ్రేడ్', 'ప్రతి రోజూ పండగే', 'ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య' లాంటి సినిమాల్లోనూ ఆయన నటించారు. హీరోగా చేసిన 'కలర్ ఫొటో' సుహాస్ కు మంచి పేరు తీసుకువచ్చింది. సందీప్‌ రాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చాందినీ చౌదరి హీరోయిన్ గా నటించారు. అంతే కాదు ఈ సినిమా జాతీయ అవార్డు అందుకుంది.