Sree Vishnu, Priyadarshi, Rahul Ramakrishna Crazy Entertainer Om Bheem Bush, Teaser Out Now: శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముగ్గురు క‌లిసి న‌టిస్తున్న సినిమా 'ఓం భీమ్ బుష్'. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసిన‌ప్పుడే అంచ‌నాలు పెరిగిపోయాయి. 'బ్రోచేవారెవరురా' సినిమాతో ప్రేక్షకుల్ని ఇప్ప‌టికే క‌డుపుబ్బా న‌వ్వించారు ఈ ముగ్గురు. దీంతో మ‌ళ్లీ క‌లిశారు అంటే క‌చ్చితంగా న‌వ్విస్తారు అని డిసైడ్ అయ్యారు ప్రేక్ష‌కులు. అంతేకాకుండా ఈ సినిమాని 'హుషారు', 'రౌడీ బాయ్స్' ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు రిలీజైన  'ఓం భూమ్ బుష్' టీజ‌ర్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. ముగ్గురు క‌లిసి చేసే కామెడీ ఎలా ఉండ‌బోతుందో దీంట్లో చూపించారు మేక‌ర్స్. ఈ సినిమాలో ర‌చ్చ‌ర‌వి త‌దిత‌ర క‌మెడియ‌న్లు కూడా ఉన్నారు.సైంటిస్టులుగా వ‌చ్చిన ఆ ముగ్గురిని ప‌ల్లెటూరి వాళ్లు వింత‌గా చూడ‌టం, ద‌య్యాలు వ‌దిలించే వాళ్లు అనుకోవ‌డం లాంటి సీన్లు క‌డుపుబ్బా న‌వ్విస్తాయి.  


సైంటిస్టులుగా ముగ్గురు.. 


ఈ సినిమాలో శ్రీ‌విష్ణు, రాహుల్ రామ‌కృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి ముగ్గురు సైంటిస్టులుగా క‌నిపిస్తారు. సైంటిస్టులు అయిన ముగ్గురు సిటీ నుంచి ప‌ల్లెటూరుకి వెళ్తారు. ఇక టీజ‌ర్ స్టార్టింగ్ లో ఒక పేషంట్ కి ట్రీట్మెంట్ చేసేందుకు ముగ్గురు క‌లిసి యూట్యూబ్ చూస్తున్న‌ట్లు చూపించారు. ఇక సైంటిస్టులుగా ఊరికి వ‌చ్చిన ఈ ముగ్గురు ఏదో నిధి కోసం వెతుకుతున్న‌ట్లు చూపించారు. అదే టీజ‌ర్ లో హార‌ర్ సీన్ల‌ను చూపించారు. ఇక విష్ణు త‌న కామెడీ టైమింగ్ తో న‌వ్వించ‌గా, ప్రియద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ కూడా త‌మ పంచ్ డైలాగుల‌తో న‌వ్వించే ప్ర‌య‌త్నం చేశారు. 



 


మార్చి 22న 'ఓం భీమ్ బుష్' విడుదల


'ఓం భూమ్ బుష్ టీజ‌ర్ చూస్తే దాంట్లో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయ‌ని అనిపిస్తోంది. ఇటు కామెడీ, అటు హార‌ర్ రెండు క‌లిపి తీస్తున్న‌ట్లుగా అనిపిస్తుంది. మ‌రి సినిమా ఎలా ఉండ‌బోతుందో తెలియాలంటే మార్చి 22న థియేట‌ర్ల‌కు వెళ్లి చూడాల్సిందే. మార్చి 22న థియేటర్లలో 'ఓం భూమ్ బుష్' చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా చిత్ర బృందం ప్ర‌క‌టించింది. ఆల్రెడీ సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. 



ఈ సినిమాలో ప్రీతి ముకుంద్, అయేషా ఖాన్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. శ్రీ‌కాంత్ అయ్యంగార్, అదిత్య మీన‌న్, ర‌చ్చ‌ర‌వి త‌దితరులు ముఖ్య  పాత్ర‌లు పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ సమర్పణలో వి సెల్యులాయిడ్స్ పతాకంతో కలిసి సునీల్ బలుసు ప్రొడ్యూస్ చేస్తున్నారు ఈ సినిమాని. శ్రీ‌కాంత్ రామిశెట్టి ఆర్ట్ డైరెక్ట‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా, స‌న్నీ ఎంఆర్ మ్యూజిక్ అందించారు. కూర్పు విష్ణు వర్షన్, సినిమాటోగ్ర‌ఫీ రాజ్ తోట. ఇక ఈ సినిమా ద‌ర్శ‌కుడు 'హుషారు' సినిమాతో ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించాడు. దీంతో 'ఓం భీం బుష్' కూడా ఆ త‌ర‌హాలోనే ఉంటుంద‌ని తెలుస్తోంది. టీజ‌ర్ కూడా ఆ రేంజ్ లో ఉండ‌టంతో అంచ‌నాలు పెరిగిపోయాయ‌నే చెప్పాలి. 


Also Read: ఆ విష‌యంలో మాత్రం చాలా కోపంగా ఉంది - వ‌రుణ్, లావ‌ణ్య ల‌వ్ స్టోరీపై చిరంజీవి కామెంట్స్