Bommarillu Movie Re Release Date Announced: "అంతేనా.. కుదిరితే కప్‌ కాఫీ, వీలైయితే నాలుగు మాటలు" యూత్‌లో యమ క్రేజ్‌ సంపాదించుకుంది ఈ డైలాగ్‌. ఈ ఒక్క డైలాగ్‌తో జెన్నిలియా కుర్రాళ్ల గుండెల్లో కూడుకట్టుకుంది. అబ్బాయి కలల రాకుమారి అయిపోయింది. ప్రియురాలు అంటే ఇలా ఉండాలని అప్పట్లో ప్రతి ఒక్కరి డ్రీమ్‌ గర్ల్‌గా అయిపోయింది జెన్నిలియా. హీరో సిద్ధార్థ్‌ని అయితే అమ్మాయిల కలల రాకుమారుడిని చేసింది ఈ సినిమా. అదే 'బొమ్మరిల్లు'. ఫ్యామిలీ అండ్‌ లవ్‌ డ్రామాగా వచ్చిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషనల్‌ హిట్‌ అయ్యింది. ఈ సినిమాలోని ప్రతి డైలాగ్స్‌ ఎవర్‌ గ్రీన్‌ అనే చెప్పాలి. 


ఎవర్ గ్రీన్ 'బొమ్మరిల్లు'


అంతేనా.. అంటూ జెనిలియా కుర్రకారు మనసు దొచేస్తే.. ఇంకేం కావాలంటూ అమాయకంగా అడిగి లవర్‌ బాయ్‌ అయిపోయాడు సిద్దు. యూత్‌లో యమ క్రేజ్ సంపాదించుకున్న ఈ సినిమా 2006లో విడుదలై బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచింది. లవ్‌, ఎమోషన్స్‌, ఫ్యామిలీ, ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అన్ని వర్గాల ఆడియన్స్‌ని ఆకట్టుకుంది ఈ సినిమా. ప్రేమకథగా యూత్‌రి, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌ థియేటర్లకు క్యూ కట్టేలే చేసింది. 2006 ఆగస్ట్‌ 9న థియేటర్లో విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించింది. ఈ మూవీ వచ్చి ఇప్పటికీ 18 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ఎవర్‌ గ్రీన్‌గా అదే క్రేజ్‌ను కొనసాగిస్తుంది.






ఆ రోజున థియేటర్ లో సందడి


ఈ సినిమాలో డైలాగ్స్‌ ఇప్పటికీ సోషల్‌ మీడియాలో వినిపిస్తున్నానే ఉంటాయి. అంతేకాదు పలు సినిమాల్లోనూ బొమ్మరిల్లు డైలాగ్స్‌ని వాడేస్తున్నారు. అంతగా ఆడియన్స్‌ని ఆకట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు మళ్లీ థియేటర్లో సందడి చేసేందుకు రెడీ అవుతుంది. ఈ బొమ్మరిల్లు మళ్లీ థియేటర్లోకి తీసుకువస్తున్నట్టు దిల్‌ రాజ్‌ నిర్మాణ సంస్థ ప్రకటించింది. సెప్టెంబర్‌ 21న బొమ్మరిల్లును రిరిలీజ్‌ చేయబోతున్నట్టు తాజాగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ నిర్మాణ సంస్థ తమ ఎక్స్‌లో అధికారిక ప్రకటన ఇచ్చింది. ఈ అప్‌డేట్‌ చూసి యూత్‌ అంతా పండగ చేసుకుంటుంది. ఈ వింటేజ్‌ లవ్‌ స్టోరీని మరోసారి థియేటర్లో చూసేందుకు తెగ ఆసక్తిని చూపిస్తున్నారు.



"ఎప్పటికీ చెరిగిపోని సినిమా. ఆ ఆనందాన్ని పంచడానికి వచేస్తున్నాం. కుదిరితే కప్ కాఫీ SEPTEMBER 21st మళ్ళి  థియేటర్స్‌లో" అంటూ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ ప్రకటన ఇచ్చింది. కాగా ఈ సినిమా సాధించిన విజయం, యూత్‌లో తెచ్చుకున్న క్రేజ్‌తో ఏకంగా డైరెక్టర్‌ ఈ సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. భాస్కర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌లో దిల్‌ రాజు నిర్మించిన సంగతి తెలిసిందే. హీరో సిద్ధార్థ్‌, జెన్నిలియా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ప్రకాశ్‌ రాజ్‌, జయసుధ, సురేఖ వాణి, సునీల్‌ ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషించారు.  



Also Read: సందీప్‌ రెడ్డి వంగాతో 'దేవర' టీం ముచ్చట్లు - జాన్వీపై కొరటాల ఆసక్తికర కామెంట్స్‌! అదిరిపోయిన ప్రొమో