Lavanya Slapped RJ Shekar Basha in Live: గత నెల రోజులుగా రాజ్‌ తరుణ్‌-లావణ్య కేసు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌ మారింది. ఈ కేసు రోజుకో ట్విస్ట్‌ ఇస్తూ మలుపులు తిరుగుతుంది. రాజ్‌ తరుణ-లావణ్య కేసులో మధ్య ఆర్జే శేఖర్‌ భాషా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఈ కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. అతడు లావణ్యపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఆమె రహస్యాలన్ని బట్టబయలు చేస్తున్నారు. లావణ్య డ్రగ్స్‌ తీసుకోవడమే కాదు ప్లేడర్స్‌తో కలిసి విక్రయాలు చేస్తుందంటూ ఆమెపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నాడు. ఇందుకు సంబంధించి ఆధారాలతో సహా బయట పడుతున్నాడు.


రోజుకో యూట్యూబ్‌ ఛానల్‌కు ఇంటర్య్వూ ఇస్తూ లావణ్య బండారం బయటపెడుతున్నాడు. అంతేకాదు మస్తాన్‌ సాయికి ఆమెకు శారీరక సంబంధం కూడా ఉందని, వారిద్దరు మాట్లాడుకున్న ఆడియో రికార్డ్స్‌ని కూడా లైవ్‌ బయటపెట్టాడు. మరోవైపు లావణ్య కూడా శేఖర్‌ భాషాపై మండిపడుతుంది. తమ మధ్యలో రావడానికి ఇతనేవరని, ఫేం కోసమే ఇలా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని మండిపడింది. ఇలా గత కొద్ది రోజులుగా లావణ్య-శేఖర్‌ భాషాల మధ్య మాటల యుద్దమే నడుస్తుంది. ఈ క్రమంలో ఓ టీవీ డిబెట్‌లో ఎదురుపడ్డ వీరిద్దరు లైవ్‌లోనే రచ్చ రచ్చ చేశారు.


లైవ్‌లోనే లావణ్య శేఖర్‌ భాషాను చెప్పుతో కొట్టిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. తాజాగా శేఖర్‌ భాషా, లావణ్యతో పాటు మరోవ్యక్తి డిబెట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శేఖర్‌ భాషా లావణ్య డ్రగ్స్‌ విక్రయిస్తుందని, అమాయకమైన అమ్మాయిలను డ్రగ్స్‌ అలవాటు చేస్తూ వారి జీవితాలు నాశనం చేస్తుందంటూ ఆరోపిస్తుండగా.. లావణ్య కాలుకు ఉన్న చెప్పు తీసి శేఖర్‌ భాషాపై విసిరికొట్టింది. దీంతో ఆగ్రహనికి గురైన అతడు లావణ్యపై విరుచుకుపడ్డాడు. ఇద్దరి గట్టిగా అరుచుకుంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో లైవ్‌లోనే ఇద్దరు తిట్టుకు రచ్చ రచ్చ చేశారు. కాగా రాజ్‌ తరుణ్‌ తనని ప్రేమ పేరుతో మోసం చేశాడని, పదకొండేళ్లు తనతో రిలేషన్‌ ఉన్నాడని పేర్కొంది. హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో ఎఫైర్‌ పెట్టుకుని తనని వదిలించుకోవాలని చూస్తున్నాడంటూ జూలై 5వ తేదీన హైదరాబాద్‌ నార్సింగ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.



అంతేకాదు తామిద్దరం రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నామని, రాజ్‌ తరుణ్‌ తనకి అబార్షన్‌ కూడా చేయించాడని ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత రాజ్‌ తరుణ్‌ కూడా లావణ్యకు మస్తాన్‌ సాయి అనే వ్యక్తితో సహజీవనం చేసిందని ఆరోపించాడు. అంతేకాదు ఆమె మద్యపానం, సిగరేట్‌ అలవాట్లు ఉన్నాయని, డ్రగ్స్ కూడా తీసుకుంటుందంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. లావణ్య ఆరోపణలతో రాజ్‌ తరుణ్‌ అజ్ఞాతంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. గతకొద్ది రోజులుగా మీడియా ముందుకు రాకుండ ముఖం చాటేశాడు. చాలా రోజుల తర్వాత రాజ్‌ తరుణ్‌ తన మూవీ తిరగబడరా సామీ మూవీ ప్రెస్‌మీట్‌కు హాజరయ్యాడు. ఈ ప్రెస్‌లో లావణ్యతో వివాదంపై పలు ప్రశ్నలపై స్పందిస్తూ వివరణ ఇచ్చాడు. 



Also Read: వంద రూపాయలకే 'కల్కి 2898 ఏడీ' టికెట్‌ - బంపర్‌ ఆఫర్‌ ప్రకటించిన మేకర్స్‌