Welcome Back Sai Tej: యువ హీరో, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గత ఏడాది సెప్టెంబర్‌లో రోడ్ యాక్సిడెంట్‌కు గురైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. మెగా ఫ్యామిలీ వేడుకల్లోనూ, ఇతర ఫంక్షన్స్‌లో ఆయన కనిపించినా... షూటింగ్ మాత్రం చేయలేదు. యాక్సిడెంట్ అయిన ఆరు నెలల తర్వాత... ఈ రోజు (మంగళవారం, 29 మార్చి 2022) తొలిసారి సెట్స్‌కు వచ్చారు.


సాయి తేజ్ కథానాయకుడిగా ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, దర్శకుడు సుకుమార్ ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంస్థలపై తెరకెక్కుతోంది. సాయి తేజ్ 15వ చిత్రమిది. నేడు సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. సాయి తేజ్ సెట్స్‌లో జాయిన్ అయ్యారు. ఆయనకు యూనిట్ అంతా గ్రాండ్ వెల్కమ్ చెప్పింది. యూనిట్ సభ్యులు 'వెల్కమ్ సాయి తేజ్' అని రాసి ఉన్న ప్లకార్డులు పట్టుకుంది. యూనిట్ సభ్యుల ఆత్మీయ స్వాగతం చూసి సాయి తేజ్ చలించిపోయారు. ఎమోషనల్ అయ్యారు. ఆనంద భాష్పలతో అందరికీ నమస్కరించారు. థాంక్స్ చెప్పారు.


Also Read: అతడి వల్లే ఇంకా బతికున్నా, సాయి ధరమ్ తేజ్ 'థాంక్యూ నోట్'


సాయి తేజ్ సెట్స్‌కు వచ్చిన సందర్భంగా యూనిట్ వెల్కమ్ చెప్పడమే కాదు, ఆయన కోసం వరుణ్ తేజ్ కూడా సెట్స్‌కు వచ్చారు. కాసేపు మెగా హీరోతో సరదాగా ముచ్చటించారు. ఆర్. నారాయణమూర్తి సైతం సెట్స్‌కు విచ్చేసి సాయి తేజ్ ను కలిశారు. 


Also Read: తండ్రి క్లాప్, తల్లి కెమెరా స్విచ్ఛాన్‌తో వరుణ్ తేజ్ కొత్త సినిమా ఓపెనింగ్