Samantha Reaction About Her Child : స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం 'మా ఇంటి బంగారం' సక్సెస్ జోష్‌లో ఉన్నారు. అదే సంతోషంతో సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంటుండగా మరో గుడ్ న్యూస్ కూడా తెలిసింది. తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి వేడుకల్లో పాల్గొనగా... సమంత బేబీ బంప్ ఫోటోస్ వైరల్‌గా మారాయి. దీంతో ఆమె తల్లి కాబోతోందనే వార్త వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో గతంలో ఆమె పిల్లల గురించి మాట్లాడిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Continues below advertisement

'అదే నా ప్రపంచం'

తనకు పుట్టబోయే పిల్లల గురించి సమంత గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. 'నా బిడ్డే నా ప్రపంచం అవుతుంది. ఉద్యోగం చేసుకుంటూ పిల్లలు, ఇంటి బాధ్యతలను చూసుకునే మహిళలంటే నాకు ఎంతో గౌరవం. నా చిన్నప్పుడు ఎన్నో కష్టాలు పడ్డాను. అలాంటి బాల్యం గడిపిన వారంతా వారి పిల్లలకు విలాసవంతమైన, లగ్జరీ లైఫ్ ఇవ్వాలని అనుకుంటారు. నేను కూడా అలాగే నిర్ణయించుకున్నా. నా బిడ్డ పుట్టిన తర్వాత కొన్నేళ్ల పాటు తనను వదిలి ఎక్కడికీ వెళ్లను. తనే నా సర్వస్వంగా చూసుకుంటా.' అని అన్నారు.

Continues below advertisement

Also Read : This Week OTT Movies : ఈ వారం ఓటీటీల్లో 21 మూవీస్ - తెలుగులో మూవీస్ డోంట్ మిస్

'మా ఇంటి బంగారం' సక్సెస్ సెలబ్రేషన్స్‌లో తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి సమంత సందడి చేశారు. ఇద్దరూ కలిసి కేక్ కట్ చేయగా... సమంత బేబీ బంప్‌తో కనిపించారు. దీంతో ఆమె తల్లి కాబోతున్నారనే వార్త వైరల్ అయ్యింది. సన్నిహితులు సమాచారం ప్రకారం... సమంత, రాజ్‌లకు ఇది ప్రత్యేక సమయమని, వాళ్లిద్దరూ కొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్నారని వెల్లడించాయి. అయితే, అటు సమంత కానీ ఇటు రాజ్ నిడిమోరు కానీ ఈ విషయంపై స్పందించలేదు. త్వరలోనే వీరిద్దరూ అఫీషియల్‌గా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. దీని తర్వాత సమంత సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకునే ఛాన్స్ ఉంది.

రికార్డు కలెక్షన్స్

అటు, సమంత మా ఇంటి బంగారం బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. 3 రోజుల్లో వరల్డ్ వైడ్ రూ.41.79 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఇండియావ్యాప్తంగా రూ.23.10 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది. నార్త్ అమెరికాలో $1.25M గ్రాస్ కలెక్షన్స్ సాధించి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. సమంత నటనకు ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా అయ్యారు. ట్రెడిషనల్ లుక్‌తో పాటు యాక్షన్ సీన్స్‌లో సమంత అదరగొట్టారు. సోషల్ మీడియాలో సినిమాకు సంబంధించి రీల్స్ కూడా వైరల్‌గా మారాయి.

ఈ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వహించగా... రాజ్ నిడిమోరు స్టోరీ అందించారు. సమంతతో పాటు గుల్షన్ దేవయ్య, దిగంత్, మంజుషా, సీనియర్ నటి గౌతమి, శ్రీముఖి తదితరులు కీలకపాత్రలు పోషించారు.

Also Read : Sai Durgha Tej : సాయి దుర్గా తేజ్ సంబరాల ఏటిగట్టు ఆలస్యం - రూమర్స్‌కు సుప్రీం హీరో చెక్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.