సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభం అయింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కొత్త దర్శకుడు జయంత్ దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.


సాయి ధరమ్ తేజ్ 15వ సినిమా మిస్టిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతుంది. ఈ సినిమాకి సుకుమార్ కథ అందిస్తుండగా కార్తీక వర్మ దండు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీలో అజయ్, బ్రహ్మాజీ, సునీల్ తదితరులు నటిస్తున్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కన్నడ సినిమా ‘కాంతార’ కు సంగీతం అందించిన అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు.


ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా టైటిల్, టీజర్ ను డిసెంబర్ 7వ తేదీన విడుదల చేయనున్నట్లు సమాచారం. అసలు విషయమేమిటంటే ఈ టీజర్ ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదల చేస్తారనే టాక్ నడుస్తోంది.


ఈ సినిమాకి 'రుద్రవనం' అనే టైటిల్‌ను  ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.. కథ ప్రకారం.. సినిమాలో రుద్రవనం అనే ఊరు ఉంటుంది. ఆ ఊరిలో ఊహించని విధంగా హత్యలు, ఆత్మహత్యలు జరుగుతుంటాయి. వాటిని హీరో ఎలా ఛేదించాడనే కాన్సెప్ట్ తో సినిమాను తెరకెక్కిస్తున్నారు. నిజానికి ఇలాంటి కాన్సెప్ట్ తో ఇదివరకు చాలా సినిమాలొచ్చాయి. కాకపోతే సాయిధరమ్ తేజ్ తొలిసారి ఇలాంటి జోనర్ లో నటిస్తున్నారు.