Regina in OTT Platforms : కోలీవుడ్ నటి సునైనా నటించిన తమిళ చిత్రం 'రెజీనా(Regina)' జూన్ 23న థియేటర్లలో విడుదలైంది. నూతన దర్శకుడు డొమిన్ డిసిల్వా(Domin DSilva) దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ థ్రిల్లర్.. ఇప్పుడు రెండు ఓటీటీ (OTT) ప్లాట్‌ఫారమ్‌లలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహాలో జూలై 25, 2023 నుంచి ఈ సినిమా ప్రీమియర్ అవనున్నట్టు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. అదే రోజు తెలుగు, ఇతరాత్ర భాషల్లో కూడా ఈ మూవీని రిలీజ్ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.


థియేటర్లలో మెజారిటీ ప్రేక్షకులను మెప్పించడంలో 'రెజీనా' విఫలమైంది. అనంత్ నాగ్, నివాస్ ఆదితన్ తదితరులు సహాయక పాత్రల్లో నటించిన ఈ సినిమా.. ఎల్లో బేర్ ప్రొడక్షన్‌కు చెందిన సతీష్ సంగీత దర్శకుడుగా వ్యవహరించారు. ఈ మహిళా సెంట్రిక్ మూవీని షూట్ చేసేందుకు చిత్ర యూనిట్ బాగానే శ్రమించినట్టు తెలుస్తోంది. దట్టమైన కొండ ప్రాంతాల్లో ఈ చిత్ర షూటింగ్‌ జరిగింది. హీరోయిన్‌ సునైన తన ఇమేజ్‌ను పక్కనపెట్టి మరీ.. ఈ సినిమా కోసం ప్రొడక్షన్‌ అసిస్టెంట్‌గా మారిపోయారు. చిత్ర షూటింగ్ నిమిత్తం అవసరమైన సామగ్రిని యూనిట్‌ సభ్యులతో పాటు హీరోయిన్‌ సునైన కూడా మోసుకెళ్ళినట్లుగా చిత్రయూనిట్ గతంలోనే ప్రకటించింది. దీంతో ఈ సినిమా కోసం ఆమె సాహసమే చేసిందని కూడా చిత్ర బృందం వెల్లడించింది. 


Read Also : Amy Jackson: గేట్‌వే ఆఫ్ ఇండియా ముందు లిప్ లాక్‌తో రెచ్చిపోయిన ఎమీ జాక్సన్


భుజంపై సునైన ఒక బ్యాగును మోసుకెళ్తున్న ఫొటోను అప్పట్లో మేకర్స్ రిలీజ్‌ చేశారు. ప్రొడక్షన్‌ సిబ్బందితో పాటు ఆమె కూడా కష్టపడటం గమనార్హం. కేరళలోని తొడుపుళ కొండల్లో ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఇందుకోసం అవసరమైన సామాగ్రిని వాహనాల్లో తీసుకెళ్లేందుకు సరైన మార్గం లేకపోవడంతో ప్రొడక్షన్‌ సిబ్బందే లొకేషన్‌ స్పాట్‌కు స్వయంగా మోసుకెళ్లారు. వీరికి సునైన కూడా తన వంతు సాయం చేశారు. ఈ విషయం అప్పట్లో సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 


సతీష్‌ నాయర్‌  నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా.. బ్యాంక్ దోపిడీ నేపథ్యంలో ఒక యువతి జీవితం ఎలా మలుపు తిరిగిందనేది స్టోరీగా తెలుస్తోంది. ఓ యాక్షన్ డ్రామాగా దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కానీ ప్రేక్షకులను మాత్రం ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈ సినిమా సెన్సార్ నుంచి U/A సర్టిపికేట్‌ను సొంతం చేసుకుంది.


పద్దెనిమిదేళ్ల క్రితం వచ్చిన 'కుమార్ వర్సెస్ కుమారి(Kumari Vs Kumari)' సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది తమిళ బ్యూటీ సునయన. ఈ తర్వాత 'సమ్ థింగ్ స్పెషల్(Something Special)', 'టెన్త్ క్లాస్' ఇలా తెలుగులోనే తొలి మూడు సినిమాలు చేసింది.


Read Also : Most Popular Indian Stars: ఇండియాలోనే మోస్ట్ పాపులర్ స్టార్ ఎవరో తెలుసా? మీరు అస్సలు ఊహించలేరు!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial