Rashmika On Valentines Day Plans: రష్మిక మందన్నా ప్రస్తుతం 'యానిమల్‌' మూవీ సక్సెస్‌ జోష్‌లో ఉంది. గతేడాది డిసెంబర్‌ 1న రిలీజైన ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. యాక్షన్‌ అండ్‌ రొమాంటిక్‌ డ్రామాగా వచ్చిన యానిమల్‌ యూత్‌ని బాగా ఆకట్టుకుంది. అంతేకాదు ఓ వర్గం ఆడియన్స్‌ని నుంచి నెగిటివ్‌ టాక్‌ తెచ్చుకున్న అవేవి మూవీపై ప్రభావం చూపలేకపోయాయి. ఫైనల్‌గా యానిమల్‌ దాదాపు తొమ్మిది వందలకు పైగా కోట్ల గ్రాస్‌ వసూళ్లు చేసింది. ఇక ఇందులో గీతాంజలి పాత్రలో రష్మిక ఆకట్టుకుంది. ఆమె రోల్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇక మూవీ బ్లాక్‌బస్టర్‌ అవ్వడంతో ఆమెకు మరింత క్రేజ్‌ పెరిగింది.


ప్రస్తుతం మూవీ సక్సెస్‌ని ఎంజాయ్‌ చేస్తున్న రష్మిక అదే జోష్‌లో 'పుష్ప 2' మూవీ షూటింగ్‌లో పాల్గొంటుంది. ఇలా సినిమా షూటింగ్స్‌తో బిజీ బిజీగా ఉన్న రష్మిక వాలంటైన్‌ డేకి ఒక రోజు ముందు ఆన్‌లైన్లోకి రావడం విశేషం. రేపు ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా.. నేడు రష్మిక ట్విటర్‌ వేదికగా లైవ్‌ చాట్‌ నిర్వహించింది. 'చాలా రోజులైంది.. మాట్లాకుందామా?' అంటూ లైవ్‌ చాట్‌కు వచ్చింది. ఇంకేముందు ఆమె ఫ్యాన్స్‌ అంతా రేపు వాలంటైన్‌ డే స్పెషల్‌ ఏంటీ? అంటూ ప్రశ్నించారు. దీనికి ప్రత్యేకమైన ప్లాన్స్‌ అంటూ ఏం లేవని.. రోజూ లాగే షూటింగ్‌కి వెళ్లాలని అంటూ తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చింది.


Also Read: క్లింకార ట్విన్ సిస్టర్స్‌ని పరిచయం చేసిన ఉపాసన! ఫొటో వైరల్‌


కాగా రౌడీ హీరో విజయ్‌ దేవరకొండతో డేటింగ్‌ రూమర్స్‌ రష్మిక కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. విజయ్‌ రూమర్డ్‌ గర్ల్‌ఫ్రెండ్‌గా నెటిజన్లు ఆమెను పిలుస్తుంటారు. దానికి తోడు జంటగా వీరిద్దరు డిన్నర్‌, లంచ్‌ డేట్స్‌ వెళ్లి మీడియా కంట పడుతుంటారు. ఇక పండుగలకు రష్మిక విజయ్‌ ఇంట వాలిపోతుంది. గతేడాది దీపావళి పండుగ సందర్భంగా రష్మిక విజయ్ ఇంటికి వెళ్లిన సంగతి తెలిసిందే. దాంతో అప్పటి నుంచి వీరిద్దరి పెళ్లంటూ రూమర్స్‌ పుట్టుకొచ్చాయి. ఇదిలా ఉంటే రష్మిక లైవ్‌ చాట్‌లో ఆమెకు మరిన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. కొందరు నెటిజన్లు 'పుష్ప 2'పై ఏదైనా అప్‌డేట్‌ ఇవ్వాలని ఆమెను కోరారు.






దానికి ఆమె కొత్త అప్‌డేట్స్‌ ఏం లేవని, 'పుష్ప 2' షూటింగ్‌ మాత్రం సూపర్‌ ఫాస్ట్‌గా జరుగుతుందని చెప్పింది. అంతేకాదు ఆగస్ట్‌ 15న మూవీ రిలీజ్‌ తర్వాత మీ అందరి రెస్పాన్స్‌ చూడాలని ఉందంటూ రిప్లై ఇచ్చింది. అదేవిధంగా ఓ రూమర్‌పై ఆమె క్లారిటీ ఇచ్చింది. ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ స్క్రిప్ట్‌ నచ్చకపోయినా.. హీరో శర్వానంద్‌ డైరెక్టర్‌ కిషోర్‌ తిరుమల కోసమే చేసిందంటూ ప్రచారం చేశారు. తాజాగా దీనిపై కూడా ఆమెకు ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె స్పందిస్తూ.. 'ఎవరూ చెప్పారు మీకు.. స్క్రిప్ట్‌పై నాకు నమ్మకం ఉంటేనే సినిమాలు చేస్తానని, ఆ టీంతో కలిసి పనిచేయడం నాకు దక్కిన గౌరవం' అంటూ రూమర్లకు చెక్‌ పెట్టింది.