యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni), డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannath)లది బ్లాక్ బస్టర్ కాంబినేషన్! వాళ్ళిద్దరూ చేసిన 'ఇస్మార్ట్ శంకర్' బాక్సాఫీస్ బరిలో రికార్డులు క్రియేట్ చేసింది. ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఆ సినిమా ఎండింగులోనే దానికి సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. తామిద్దరం కలిసి మరో సినిమా చేస్తామని రామ్, పూరి అనౌన్స్ చేశారు కూడా! ఇప్పుడు వాళ్ళ కాంబినేషన్ కుదిరింది.


'డబుల్ ఇస్మార్ట్'... ఇది సీక్వెల్ గురూ!
రామ్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమాకు 'డబుల్ ఇస్మార్ట్' (Double ISMART Movie) టైటిల్  ఖరారు చేశారు. ఇది 'ఇస్మార్ట్ శంకర్' సీక్వెల్ అన్నమాట. సినిమాను అనౌన్స్ చేయడంతో పాటు థియేటర్లలో ఎప్పుడు విడుదల చేసేదీ చెప్పేశారు. వచ్చే ఏడాది మార్చి 8న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు చెప్పారు (Double ISMART Release Date). పూరి కనెక్ట్స్ పతాకంపై పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ సినిమాను నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా రిలీజ్ అని కన్ఫర్మ్ చేశారు. 






'ఇస్మార్ట్ శంకర్'లో హైదరాబాదీ యువకుడిగా రామ్ పోతినేని సందడి చేశారు. ఇక, సినిమాలో తెలంగాల యాసలో ఆయన చెప్పిన డైలాగులు పాపులర్ అయ్యాయి. రామ్ నటన, పూరి మార్క్ డైలాగులు & దర్శకత్వానికి తోడు మణిశర్మ సంగీతం సైతం విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడీ సినిమాకు కూడా ఆయన్ను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు.


Also Read : భద్రాచల రామయ్యకు వెండితెర రామయ్య 'ఆదిపురుష్' ప్రభాస్ విరాళం - ఎంత ఇచ్చారంటే?


'ఇస్మార్ట్ శంకర్' తర్వాత రామ్ పోతినేని రెండు సినిమాలు విడుదల చేశారు. 'రెడ్', 'ది వారియర్' తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్ళారు. పుట్టినరోజు సందర్భంగా రేపు ఆ సినిమా గ్లింప్స్ (Boyapati Rapo movie first thunder) విడుదల కానుంది. ఆల్రెడీ అందులో రామ్ లుక్ విడుదల చేశారు. అది మాసీగా ఉంది. ఇక, బుల్ ఫైట్స్ సీన్స్ అయితే ఊర మాస్ అనేలా ఉంటాయని యూనిట్ చెబుతోంది. అది పాన్ ఇండియా సినిమా. ఇప్పుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమానూ పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేలా ప్లాన్ చేశారట.  


Also Read సొసైటీ కోసం ప్రెగ్నెంట్ కాలేదు, నాకు నచ్చినప్పుడు, రెడీగా ఉన్నప్పుడు బిడ్డకు జన్మ ఇవ్వాలని... మదర్స్ డేకి ఉపాసన సెన్సేషనల్ పోస్ట్ 




సాధారణంగా యమా స్పీడుగా సినిమాలు చేసే పూరి జగన్నాథ్ మాత్రం 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత దర్శకుడిగా ఒక్కటంటే ఒక్క సినిమా మాత్రమే చేశారు. అదీ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా సినిమా 'లైగర్'. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో డిస్ట్రిబ్యూటర్లు, ఫైనాన్షియర్ల నుంచి పూరి కొన్ని సమస్యలు ఫేస్ చేశారు. డబ్బులు వెనక్కి తిరిగి ఇచ్చే విషయంలో చర్చలు జరిగాయి. అయితే... తాను రిటర్న్ చేస్తానని చెప్పినప్పటికీ పరువు పోయే విధంగా డిస్ట్రిబ్యూటర్లు ధర్నాకు దిగడంతో రూపాయి కూడా తిరిగి ఇచ్చే ఆలోచనలో పూరి జగన్నాథ్ లేరని ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అదీ సంగతి!