ప్రముఖ నిర్మాత, దర్శకుడు శేఖర్ కపూర్ మాజీ భార్య, సుచిత్రా కృష్ణమూర్తి (Suchitra Krishnamoorthi) తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులు, ఎదురైన అవమానాలు, సహా పలు విషయాలను వివరించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) గురించి పలు కీలక విషయాలను వెల్లడించారు. ఒకనొక సందర్భంలో తనతో జరిగిన ఒక హాస్య సంఘటనను గుర్తు చేసుకున్నారు. ఆమె జోక్ గా చెప్పిన మాటను ఆర్జీవీ చాలా సీరియస్ గా తీసుకున్నట్లు వివరించారు.


ఆర్జీవీ ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు!


సుచిత్ర కృష్ణమూర్తి, ఆర్జీవీ కలిసి ‘మై వైఫ్స్ మర్డర్‘ తో పాటు ‘రన్‘ చిత్రాలకు కలిసి పని చేశారు. ఆ తర్వాత సుచిత్ర తన ఆత్మకథ డ్రామా క్వీన్‌లో  “నన్ను పెళ్లి చేసుకుంటావా?” అని RGVకి ఒక సందేశాన్ని పంపినట్లు ఆమె గుర్తుచేసుకున్నారు. ఆమె తన పుస్తకంలో ఇది ఒక జోక్ అని రాయలేదు. ఈ విషయాన్ని RGV సీరియస్ గా తీసుకున్నట్లు సుచిత్ర వివరించారు. వెంటనే ఆమెను తన ఆఫీస్ కు పిలిపించినట్లు వెల్లడించారు. “అతడు నా కామెంట్స్ ను చాలా సీరియస్ గా తీసుకున్నారు. వెంటనే తన ఆఫీసుకు పిలిచారు. నేను చాలా భయంకరమైన వ్యక్తిని ఇవన్నీ ఆలోచించకూడదు అని చెప్పారు. 'రాము, ఇది ఒక జోక్' అని చెప్పాను. అతడు దానిని సీరియస్‌గా తీసుకున్నాడు" అని చెప్పుకొచ్చారు. రామ్ గోపాల్ వర్మను పెళ్లి చేసుకోవడం గురించి ఎవరైనా సీరియస్‌గా ఉంటారా? అని నవ్వారు.   


ఆర్జీవీ మహిళలను ఎలా చూస్తారంటే?


పనిలో పనిగా ఆర్జీవీ మహిళలను ఎలా చూస్తారో అనే విషయాన్ని కూడా వెల్లడించారు సుచిత్ర.  అతడు మహిళలను కేవలం శృంగారం కోసం మాత్రమే ఉపయోగిస్తాడు. వారి శరీరాన్ని మాత్రమే ఇష్టపడతాడు. వారి మెదడును ఇష్టపడడు. నా అభిప్రాయం ప్రకారం, స్త్రీలు కనిపించాలి. వినకూడదు అనుకుంటాడు” అని చెప్పుకొచ్చారు.   


నటిగా, గాయనిగా మంచి గుర్తింపు


మలయాళ చిత్రం 'కిలుక్కింపెట్టి'తో జయరామ్‌ సరసన హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది సుచిత్రా కృష్ణమూర్తి. ఆ తర్వాత తమిళ చిత్రం 'శివరంజని'లో టైటిల్‌ రోల్‌ పోషించి అందరినీ ఆకట్టుకుంది. తర్వాత షారుక్ ఖాన్ ‘కభీ హా కభీ నా’, ‘జజ్‌బాత్‌ ఆగ్‌’, ‘రోమియో అక్బర్ వాల్టర్‌’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. సుచిత్రా కృష్ణమూర్తి నటిగానే కాకుండా గాయనీగా కూడా పేరు తెచ్చుకుంది. చాలా గ్యాప్ తర్వాత  'భూల్‌ భులయా 2', 'గిల్టీ మైండ్స్‌' వెబ్‌ సిరీస్‌లో నటించింది.


Also Read : యాసిడ్ దాడి బాధితురాలికి బ్యాంకులో చేదు అనుభవం, షారుఖ్ సాయం కోరుతూ ట్వీట్


ప్రీతి జింటాను ఎప్పటికీ క్షమించను!


చిత్ర పరిశ్రమలో నటిగా, గాయనిగా పనిచేసిన సుచిత్ర, దర్శకుడు శేఖర్ కపూర్‌ను 1999లో పెళ్లి చేసుకున్నారు. 2007లో విడాకులు తీసుకున్నారు. వీరి  వివాహ బంధం చెడిపోవడానికి కారణం నటి ప్రీతి జింటా అని అప్పట్లో వార్తలు వినిపించాయి. శేఖర్, ప్రీతి మధ్య ఎఫైర్ ఉందని పుకార్లు వచ్చాయి. అయితే, తాజా ఇంటర్వ్యూలో తమ విడాకుల సమయంలో ప్రీతి తనపై చేసిన వ్యాఖ్యలను ఎప్పటికీ క్షమించనని చెప్పింది.


Read Also: యాసిడ్ దాడి బాధితురాలికి బ్యాంకులో చేదు అనుభవం, షారుఖ్ సాయం కోరుతూ ట్వీట్


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial