Raskshith Shetty About Rashmika Fake Video : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న మార్ఫింగ్ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. రష్మిక డీప్ ఫేక్ వీడియోపై టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ స్టార్స్, పొలిటీషియన్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్ఫింగ్ వీడియో చేసిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. దీంతో ఈ విషయంపై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ కొన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ కి కొత్త నియమ నిబంధనలను పంపింది. ఆ నిబంధనలను ఉల్లంఘిస్తే జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా కూడా విధిస్తామని తెలిపింది.


ఇక రష్మిక ఫేక్ వీడియోపై బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబచ్చన్, విజయ్ దేవరకొండ, నాగచైతన్య, కీర్తి సురేష్, మృణాల్ ఠాకూర్ తదితరులు స్పందిస్తూ రష్మికకు మద్దతుగా నిలిచారు. రష్మిక ఫేక్ వీడియో తర్వాత కత్రినా కైఫ్ తో పాటూ తాజాగా కాజోల్ డీప్ ఫేక్ వీడియో సైతం నెట్టింట వైరల్ అయింది. ఇదిలా ఉంటే తాజాగా రష్మిక డీప్ ఫేక్ వీడియోపై ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్, కన్నడ హీరో రక్షిత్ శెట్టి పలు ఆసక్తికర కామెంట్స్ చేశాడు. రక్షిత్ శెట్టి హీరోగా నటించిన 'సప్త సాగరాల దాటి సైడ్- A' ఇటీవల తెలుగులో విడుదలై మంచి రెస్పాన్స్ ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి ఇప్పుడు సెకండ్ పార్ట్ రాబోతోంది.


'సప్త సాగరాలు దాటి సైడ్- B' పేరుతో మూవీ నవంబర్ 17 న థియేటర్స్ లో సందడి చేయనుంది. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా రక్షిత్ శెట్టి తెలుగులో వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రక్షిత్ శెట్టి రష్మిక ఫేక్ వీడియో పైకి స్పందించారు." ఇలాంటి వాటిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ప్రతి సాఫ్ట్ వేర్ కి లైసెన్స్ ఖచ్చితం అనే రూల్ తీసుకురావాలి. ప్రస్తుతం ఇలాంటి సాఫ్ట్ వేర్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. వాటిని ముందు అరికట్టాలి. రష్మిక తన కెరీర్ కోసం ఎన్నో కలలుగంటోంది" అని రక్షిత్ శెట్టి చెప్పుకొచ్చాడు.


కాగా 2017లో 'కిరిక్ పార్టీ' అనే సినిమాతో కన్నడ సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా అడుగు పెట్టింది రష్మిక మందన్న. ఆ మూవీకి 'కాంతారా' ఫేమ్ రిషబ్ శెట్టి దర్శకత్వం వహించగా రక్షిత్ శెట్టి, రష్మిక జంటగా నటించారు. ఈ మూవీ షూటింగ్ టైంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఇంట్లో పెద్దలను ఒప్పించి ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. 2017 లోనే వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత 2018 లో తమ ఎంగేజ్మెంట్ ని బ్రేక్ చేసుకుని తిరిగి సినిమాల్లో బిజీ అయ్యారు. వీళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ బ్రేక్ అవ్వడానికి అసలు కారణాలు ఏంటో ఇప్పటికీ తెలియదు. కానీ మీడియా వర్గాలు మాత్రం వాళ్ళిద్దరి బ్రేకప్ పై రకరకాల రూమర్స్ వినిపించాయి. ప్రజెంట్ ఈ ఇద్దరూ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.


Also Read : పోలీసులకు దొరికిపోయిన యాంకర్ సుమ కొడుకు - వీడియో వైరల్