Rajinikanth Touches Amitabh Bachchan Feet: ప్రస్తుతం దేశమంత అనంత్‌ అంబానీ, రాధిక మర్చంట్‌ పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులంతా అంబానీ పెళ్లిలో సందడి చేశారు. ఇక బాలీవుడ్‌ తారల హంగామా గురించి చెప్పాల్సిన పనిలేదు. జులై 3 నుంచి మొదలైన ఈ పెళ్లి వేడుకల్లో ఎక్కడ చూసిన బాలీవుడ్‌ సెలబ్రిటీల సందడే కనిపిస్తుంది. ప్రస్తుతం ఎక్కడ చూసి, ఎవరి నోట విన్న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ పెళ్లి గురించే చర్చించుకుంటున్నారు.


ఈ వివాహమహోత్సవానికి మన టాలీవుడ్‌ స్టార్స్‌, సౌత్‌ హీరోలు కూడా వెళ్లడంతో దక్షిణాదిలోనూ అంబానీ పెళ్లి అంశం ఆసక్తిని సంతరించుకుంది. మహేష్‌ బాబు,రామ్‌ చరణ్‌, సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌, విక్టరి వెంకేటేష్‌, హీరో సూర్యతో పాటు పలువురు సతీసమేతంగా అంబానీ పెళ్లికి వెళ్లారు. అక్కడ ఇతర స్టార్స్‌ మన సౌత్‌ హీరోలతో కలివిడిగా ఉంటూ వారిని అప్యాయంగా పలకిరించిన దృశ్యాలు ఫ్యాన్స్‌ని ఆకట్టుకున్నాయి. అయితే నిన్న అనంత్‌, రాధిక శుభ్‌ ఆశీర్వాద్‌ వేడుకలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఈ వేడుకులో బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, సౌత్‌ సూపర్‌ స్టార్ రజనీకాంత్‌ కలుసుకున్నారు. ఒకరినొకరు అప్యాయంగా పలకరించుకుని కాసేపు ముచ్చటించుకున్నారు.


అయితే అమితాబ్‌ను చూడగానే రజనీకాంత్‌ ఆయన కాళ్లకు నమస్కరించబోయారు.  దీంతో బిగ్‌బి వెంటనే స్పందిస్తూ రజనీని ఆపారు. అలా ఇద్దరు అగ్ర నటుల ఎలాంటి ఈగో లేకుండా మాట్లాడుకోవడం, ఒకరిపట్ల ఒకరు గౌరవం ప్రదర్శించుకోవడం చూసి ఆయా హీరో ఫ్యాన్స్‌ తెగ మురిసిపోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియో వైరల్‌ అవుతుంది. ఇక ఇద్దరు లెజెండరిలను ఒకేఫ్రేంలో చూడటం.. అదీ కూడా ఇద్దరు సరదగా ముచ్చటించుకోవడం చూస్తుంటే కన్నుల పండుగగా ఉంది. కాగా అనంత్‌ అంబానీ, రాధిక మర్చంట్‌లు జూలై 12న మూడుమూళ్ల బంధంతో ఒక్కటయ్యారు.






ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతిరథుల సమక్షంలో, వేదపండితులు, ఇరుకుటుంబ సభ్యుల మధ్య ఈ జంట వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. పెళ్లి అనంతరం వేదపండితులను ఈ జంటకు శభ్‌ ఆశిర్వాదం పేరుతో ఈవెంట్‌ను నిర్వహించి ఆశీర్వాచనాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌కు చెందిన అగ్రతారలు, నటీనటులు హజరై కొత్త జంటను ఆశీర్వదించారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ కొత్త జంటకు ఖరీదైన బహుమతి ఇచ్చి ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ పెళ్లి సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు, వెంకటేష్‌, రామ్‌ చరణ్‌, రాగా దగ్గుబాటిలు సతీసమేతంగా వచ్చారు. అక్కినేని హీరో నాగార్జున తనయుడు అఖిల్‌ కూడా ఈ పెళ్లిలో సందడి చేశాడు. 



Also Read: 'కల్కి 2898 ఏడీ' మైలురాయి, ఆ డైరెక్టర్‌ను టార్గెట్‌ చేస్తూ నాగ్‌ అశ్విన్‌ షాకింగ్ కామెంట్స్‌ - అసూయ పడ్డారా?