Raj Tarun Father Sensational Comments on Lavanya: టాలీవుడ్‌ యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌, లావణ్య కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో తాజాగా రాజ్‌ తరుణ్ తండ్రి, ఆర్జే శేఖర్‌ భాషా ఎంట్రీ ఇచ్చారు. రాజ్‌ తరుణ్‌ తల్లిదండ్రులతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని, వారి మద్దతు తనకు ఉందంటూ లావణ్య చేసిన కామెంట్స్‌ను రాజ్‌ తరున్‌ తండ్రి ఖండించారు. కొందరు కావాలని తప్పుగా చెప్పారని, తను మాట్లాడిన పూర్తి ఆడియో ఇవ్వకుండ అసలు విషయం దాచారని ఆయన వెల్లడించారు. దీంతో ఇప్పుడు ఈ కేసులో మరో ట్విస్ట్‌ నెలకొంది. ఈ కేసు విషయంలో ఆర్జే శేఖర్‌ భాషా మీడియా ముందుకు వచ్చి రాజ్‌ తరుణ్‌-లావణ్యకు మధ్య అసలేం జరిగిందనేది బయటపెట్టే ప్రయత్నం చేశాడు. ఈ సందర్బంగా లైవ్‌లో రాజ్‌ తరుణ్ తండ్రికి ఫోన్‌ చేసి లావణ్య నిజస్వరూపం బయటపెట్టాడు. 


తన కొడుకు-లావణ్య కలిసి ఉంటున్నారనే విషయం తనకు ఏడాది తర్వాత తెలిసిందన్నారు. లావణ్య మంచిది. మంచి అమ్మాయి అంటూ తన వాయిస్‌ రికార్డులో ఉన్నది నిజం కాదని, పూర్తి రికార్డు వినిపించకుండ ఎడిట్‌ చేశారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "లావణ్య వల్ల నా కొడుకు నరకం చూశాడు. ఇంటికి వెళ్లిన మమ్మల్ని కూడా బూతులు తిడుతూ ఉండేది. అత్తమామలు అనే మర్యాద కూడా ఇచ్చేది కాదు. నా కొడుకుతో మూడు రోజులు కలిసి ఉందామని వెళ్లిన మమ్మల్ని ఒక్క రోజులోనే తిరిగి వెళ్లేలా చేసింది. నా కొడుకుతో మేం మాట్లాడిన ఒర్చుకునేది కాదు. కింద మేము మాట్లాకుంటుంటే పైన వస్తువులు విసిరేస్తూ రచ్చ రచ్చ చేసేది. ఇంటికి వెళ్లిన నా భార్య చేత పనులు చేయించేది. పెద్ద వాళ్లమనే మర్యాద కూడా లేకుండ అసభ్యకరంగా తిట్టేది. 


దీంతో ఆమెతో ఉండటం కష్టమని తిరిగి వచ్చేశాం. లావణ్య మా కొడుకును మాకు దూరం చేసింది. ఓ రోజు ఫోన్ చేసి బూతులు తిడుతూ ఆపై ఆరిచింది. దీంతో ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావని వాయిస్ రైజ్‌ చేసినందుకు నానా రచ్చ చేసిందట. కాసేపటికే రాజ్‌ నాకు ఫోన్ చేసి 'ఆమెతో ఎందుకు మాట్లాడావ్‌ డాడి, ముందు తనకి క్షమాపణలు చెప్పండి' అంటూ నాకు ఫోన్ చేసి చెప్పాడు. అలా పదేళ్లు నా కొడుకుకి మాకు నరకం చూపించింది. ఈ పదేళ్లు మేం మా కొడుకుతో ఉండకుండ చేసింది. అంతేకాదు రాజ్‌ ఎవరితో మాట్లాడొద్దు, ఒక్క తనతోనే మాట్లాడాలని అనుకునేది. రాజ్‌కు అందరిని దూరం చేయాలనేది తన ఆలోచన. లావణ్య విపరీతంగా తాగుతుంది. డ్రగ్స్‌ తీసుకుంటుందని కూడా మాకు తెలుసు. కానీ ఆమె బిహేవియర్‌ వల్ల మాకు, రాజ్‌కి వాయిస్‌ లేకుండ చేసింది. రాజ్‌తో మేం మాట్లాడితే చాలు గొడవ పడుతుండేది" అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 



ఇక రాజ్‌ తరుణ్‌ సన్నిహితుడిని అంటూ తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇంటర్య్వూ ఇచ్చాడు ఆర్జే శేఖర్‌ భాషా. ఈ సందర్భంగా లావణ్య గురించి సంచలన నిజాలు పెట్టాడు. ఆమెకు డ్రగ్స్‌ అలవాటు ఉందని, రాజ్‌ తరుణ్‌ కంటే ముందు ఆమెకు చాలా మందితో ఎఫైర్‌ ఉందని చెప్పాడు. మస్తాన్‌ సాయి ఆమె సహజీవనం చేశారని, డ్రగ్స్‌ ప్లెడర్లతో కూడా ఆమెకు పరిచయాలు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. లావణ్య అమ్మాయిలను పరిచయం చేసుకుని వారికి డ్రగ్స్‌ అలవాటు చేస్తుంది.. అలా డ్రగ్స్‌ కావాలంటే తన స్నేహితులతో డ్రగ్స్‌ అమ్మేవారితో సన్నిహితంగా ఉండాలని చెబుతుంది. అలా ఉన్న వారి వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్‌ చేస్తూ డబ్బులు తీసుకోవడం, లేదా తరచూ వారిని తన స్నేహితులతో ఉండమని చెప్పడం వంటివి చేస్తుంది" అంటూ ఆర్జే శేఖర్‌ భాషా లావణ్యపై సంచలన ఆరోపణలు చేయడం ఇప్పుడు సంచలనం రేపుతుంది.



Also Read: మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటే, అల్లు అర్జున్ మీద ట్రోల్స్ ఆపేయాలి - హైపర్ ఆది సెన్సేషనల్ కామెంట్స్