Raja Saab First Glimpse Out tomorrow: ఎట్టకేలకు రాజ్‌సాబ్‌ నుంచి ఓ క్రేజీ అప్‌డేట్‌ రాబోతుంది. పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా డైరెక్టర్‌ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీపై ఫ్యాన్స్‌లో ఎన్నో సందేహాలు ఉన్నాయి. అసలు ఈ సినిమా ఉందా? క్యాన్సిల్‌ అయ్యిందా? అనే అనుమానాలు తలెత్తాయి. ఎప్పుడు సెట్‌పైకి వచ్చింది, ఎప్పుడు షూటింగ్‌ జరుపుకుందో కూడా తెలియదు.నిజానికి ఈ కాంబినేషన్‌లో సినిమా అనగానే అంతా ఆశ్చర్యపోయారు. బాహుబలి తర్వాత పాన్‌ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తున్న ప్రభాస్‌ మీడియం బడ్జెట్ డైరెక్టర్‌ మారుతితో సినిమా చేయడం ఏంటని అనుకున్నారు.


మొన్నటి వరకు ఈసినిమాపై పెద్దగా బజ్‌ లేదు. ఇక 'సలార్‌', 'కల్కి 2898 ఏడీ' చిత్రాలు విడుదలై బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయ్యాయి. దీంతో ఫ్యాన్స్‌ అంతా రాజ్‌ సాబ్‌ అప్‌డేట్స్‌ కోసం చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అందరికి సర్‌ప్రైజ్‌ ఇస్తూ ఈ సినిమా నుంచి సాలిడ్ అప్‌డేట్‌ను అనౌన్స్‌ చేసింది మూవీ టీం. ఈ చిత్రం నుంచి ఫస్ట్‌ గ్లింప్స్ రెడీ చేశారు. రేపు సాయంత్రం 5:30 గంటలకు రాజా సాబ్‌ నుంచి ఫ్యాన్స్‌కి స్వీట్‌ ట్రీట్‌ ఉండనుందంటూ మూవీ నిర్మాణ సంస్థ పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ అధికారిక ప్రకటన ఇచ్చింది. ఈ సందర్భంగా 'ఫ్యాన్‌ ఇండియా గ్లింప్స్‌' అంటూ మూవీ నుంచి అప్‌డేట్‌ ఇచ్చారు మేకరు. దీంతో ప్యాన్స్‌ ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. కాగ ఈ సినిమాలో ప్ర‌భాస్ స‌ర‌స‌న‌ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రిద్ధి కుమార్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో మెరవనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్​పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 






'రాజా సాబ్‌'లో హారర్‌ టచ్‌


రాజా సాబ్‌ కోసం మారుతి భారీ ప్లాన్‌ చేశాడట. కామెడీతో సాగే ఈ సినిమాకు హారర్‌ జానర్ టచ్ చేశాడట. వినోదాత్మకంగా సాగుతూనే మధ్యలో మధ్యలో హారర్‌తో భయపెడతుందట. ప్రభాస్‌ రేంజ్‌ను దృష్టిలో పెట్టుకుని మూవీ స్క్రిప్ట్‌లో మార్పులు చేసి కొత్త ప్రమోగం చేయబోతున్నాడట. ఇందుకోసం 'రాజాసాబ్‌'లో గ్రాఫిక్స్, విజువల్‌ ఎఫెక్ట్స్‌ వంటి టెక్నికల్‌ ఎలిమెంట్స్‌ జోడించి విజువల ఫీస్ట్‌ ఇవ్వబోతున్నాడ మారుతి. అంతేకాదు మరుతి ఈ సినిమాతో ఓ కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నాడట. ఇక సెకండ్‌ హాఫ్‌లో ఎవరూ ఊహించని రేంజ్‌లో ఉంటుందని, ఆడియన్స్‌ అంతా థ్రిల్‌ అవుతారని సినీవర్గాలు అంటున్నాయి.



అయితే డైరెక్టర్‌ మారుతికి మంచి విజువల్‌ సైన్స్‌ ఉన్న ఆయన ఎప్పుడు దీన్ని బయటపెట్టలేదు. ఎందుకంటే సినిమాల్లోకి రాకముందు ఆయన యానిమేటర్‌లో స్పెషల్‌ కోర్స్‌ తీసుకున్నారు. కానీ, ఆయన ఇంతవరకు తన విజువల్స్‌ సైన్స్‌ ఏ సినిమాలో చూపించలేదు. అవకాశం రాకపోవడంతో తన విజువల సైన్స్‌ని బయటపెట్టలేకపోయారు. ఈ సారి రాజాసాబ్‌కు ఆ చాన్స్‌ రావడంతో మారుతి తన క్రియేటివిటీకి గట్టిగా పని చెబుతున్నాడట. మరి తనదైన విజువల్స్‌ సైన్స్‌తో మరుతి ఎలాంటి సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్నాడా చూడాలి. ఇక ఈసినిమా సంజయ్ దత్‌ విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌తో పాటు పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ని కూడా జరుపుకుంటున్నట్టు సమాచారం. 



Also Read: ఫస్ట్‌టైం 'యానిమల్‌' వివాదంపై స్పందించిన రణ్‌బీర్‌ - మరోసారి ఇలాంటి సినిమా చేయనన్నాను..