అనుష్క(Anushka Shetty), ప్రభాస్ (Rebal Star Prabhas). ఈ జంటకు టాలీవుడ్​లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తాజాగా స్వీటి శెట్టి నటించిన పవర్​ఫుల్​ మూవీ 'ఘాటీ' సినిమా గ్లింప్స్(Ghaati Movie Glimpse)​ను 'రెబల్ స్టార్ ప్రభాస్' విడుదల చేశారు. దీంతో మరోసారి వీరిద్దరూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. గ్లింప్స్​ కూడా అభిమానులను బాగా ఆకట్టుకుంది. 

గ్లింప్స్​తో పీక్స్​కి తీసుకెళ్లిపోయారుగా

డైరక్టర్ క్రిష్ జాగర్లమూడి (Kirsh Jagarlamudi) దర్శకత్వంలో అనుష్క శెట్టి ప్రధానపాత్రలో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్​టైనర్ ఘాటీ. విక్రమ్ ప్రభు (Vikram Prabhu) హీరోగా చేయగా.. రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన లుక్స్, టీజర్, ట్రైలర్​తో హైప్​ని పెంచగా.. విడుదలకు ముందు ప్రభాస్ రిలీజ్ చేసిన గ్లింప్స్ హైప్స్​ని పీక్స్​కి తీసుకెళ్లాయి. మొత్తం యాక్షన్​తో నిండిన ఈ గ్లింప్స్​లో "వాళ్లు ఊరుకోరు.. వీళ్లు ఊరుకోరు అంటే నేను ఊరుకోను" అనే డైలాగ్ గ్లింప్స్​ని నెక్స్ట్ లెవెల్​కి తీసుకుంది. 

వేదం కాంబో రిపీట్

క్రిష్ దర్శకత్వంలో స్వీటీ 'వేదం' సినిమా చేసింది. అప్పట్లో వేశ్యపాత్ర చేసి.. నటించి, మెప్పించి విమర్శకులు ప్రశంసంలు అందుకొంది. వీరిద్దరూ కలిసి ఇప్పుడు ఘాటీతో సెప్టెంబర్ 5వ తేదీన వస్తున్నారు. ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. ఈ సినిమా కూడా వేదంలాగానే మంచి గుర్తింపు తీసుకువస్తుందని.. రీసెంట్​గా అనుష్క తెలిపింది. 

బాహుబలి టీమ్ సపోర్ట్.. 

స్వీటి చేసిన ఘాటీకి 'బాహుబలి' టీమ్ బాగానే సపోర్ట్ చేస్తుంది. తాజాగా రానా, అనుష్కల కాల్​ రికార్డింగ్​ బాగా వైరల్ అయింది. ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ ఘాటీ గ్లింప్స్ రిలీజ్ చేశారు. త్వరలోనే 'బాహుబలి ది ఎపిక్'​ కూడా విడుదల కానుంది. ఇదిలా ఉండగా.. ప్రభాస్ ఘాటీ గ్లింప్స్ రిలీజ్ చేస్తుంటే.. రాణి మూవీని సపోర్ట్ చేయడానికి రాజు వచ్చాడంటూ సోషల్ మీడియాలో తెగ పోస్టులు వేస్తున్నారు. ప్రభాస్, అనుష్క జంటకు ఆడియన్స్, ఫ్యాన్స్​లో ఓ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని కోరుకునేవారు కూడా చాలామందే ఉన్నారు. అయితే తాము బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ పలు సందర్భాల్లో ప్రభాస్, అనుష్క క్లారిటీ కూడా ఇచ్చారు.