Finally Case Filed on Raj Tarun: టాలీవుడ్‌ యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ కేసులో కీలక మలుపు తిరిగింది. రాజ్‌ తరుణ్‌, అతడి ప్రియురాలు లావణ్యల పరస్పర ఆరోపణలతో ఈ కేసులో రోజుకో ట్విస్ట్‌ నెలకొంది. ఈ క్రమంలో తాజాగా ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇవాల (జూలై 10)లావణ్య ;మరోసారి పోలీసులను కలిసి కీలక ఆధారాలు సమర్పించింది. వాటి ఆధారంగా నార్సింగ్ పోలీసుల తాజాగా రాజ్‌ తరుణ్‌పై కేసు నమోదు చేశారు. ఐపీసీ 493 పాటు మరి కొన్ని సెక్షన్ల  కింద అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా ఇటీవల లావణ్య రాజ్‌ తరుప్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.


హీరోయిన్‌ మాల్వీ మల్హోత్రాతో మోజులో పడి తనని వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాడని, పదకొండేళ్లు తనతో రిలేషన్‌లో ఉండి మరో అమ్మాయితో ఎఫైర్‌ పెట్టుకున్నాడంటూ లావణ్య గతవారం నార్సింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ విషయమై స్పందించిన రాజ్‌ తరుణ్‌ తిరిగి లావణ్యపై సంచలన ఆరోపణలు చేశాడు. ఆమెకు మస్తాన్‌ సాయి అనే వ్యక్తితో ఎఫైర్‌ ఉంనది, అతడితో సహజీవనం చేస్తుందంటూ ఆరోపించాడు. దీంతో ఈ కేసు రోజులో మలుపు తిరిగింది. రాజ్‌ తరుణ్‌ ఆరోపణల నేపథ్యలో నార్సింగ్‌ పోలీసులు తిరిగి ఆమెకు నోటీసులు ఇస్తూ సరైనా ఆధారాలు ఇవ్వాలంటూ ఆదేశించారు. ఈ నేపథ్యంలో హీరోయిన్‌ మాల్వీ మల్హోత్రా సైతం లావణ్యపై జూబ్లిహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.


ఏ సంబంధం లేని తనని ఈ కేసులోకి లాగారంటూ లావణ్యపై పరువు నష్టం దావా కూడా వేసింది. ఇక ఇంతకాలం సైలెంట్‌గా ఉన్న లావణ్య నేడు నార్సింగ్‌  పోలీసులు మరోసారి కలిసింది. తాజాగా తన ఫిర్యాదులకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు అందించింది. అందులో రాజ్‌ తరుణ్‌ తనకి సంబంధించిన 170 ఫొటోలను, పలు టెక్నికల్ ఆధారాలను పోలీసులకు సమర్పించడంతో పోలీసులు రాజ్‌ తరుణ్‌పై కేసు నమోదు చేశారు. అంతేకాదు ఇందులో రాజ్‌ తరుణ్‌కు తనకు పదేళ్ల క్రితమే పెళ్లయినట్టు కీలక ఆధారాలు ఉన్నట్టు తెలుస్తోంది. అప్పటి నుంచి తామిద్దరం కలిసే ఉంటున్నామని, లావణ్య అలియాస్ అన్విక అనే పేరుతో ఇద్దరు కలిసి విదేశాలకు కూడా వెళ్లినట్టు ఆమె పోలీసులకు వెల్లడించింది. 



అంతేకాదు తాను గర్భవతి కూడా అయ్యానని, తనకు అబార్షన్ చేయించాడని లావణ్య ఆధారాలతో సహా పోలీసులకు అందించింది.  ఇద్దరం హ్యాపీగా కలిసి ఉంటున్న క్రమంలో తమ మధ్యలోకి హీరోయిన్‌ మాల్వీ మల్హోత్రా వచ్చిందని, రాజ్‌ తరుణ్‌ తనతో కొంతకాలం రిలేషన్‌లో ఉంటున్నాడని ఆరోపించింది. అంతేకాదు మాల్వీ కోసం రాజ్‌ తరుచూ ముంబై కూడా వెళ్లోస్తుంటాడని, ఇప్పుడు మాల్వీతో కలిసి విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడని, ఈ క్రమంలో తనను రెచ్చగొట్టి ఉద్దేశపూర్వకంగానే వాయిస్ రికార్డు చేశారని ఆమె లావణ్య తన తాజా ఫిర్యాదులో పేర్కొంది.


Also Read: రాజ్‌తరుణ్‌ ప్రేమ కేసులో మరో బిగ్ ట్విస్ట్- లావణ్య, మాల్వీ పోటాపోటీ ఫిర్యాదులు- అబార్షన్‌ చేయించాడని ఆరోపణ