NTR AdaviRamudu: స్టార్ హీరోలకు కెరీర్ మలుపు తిప్పిన సినిమాలు థియేటర్లో మరోసారి రీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ప్రేక్షకులు కూడా తమ అభిమాన హీరోలు నటించిన మంచి బ్లాక్ బస్టర్ సినిమాలను మరోసారి థియేటర్లో చూడటానికి ఇష్టపడుతున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్, చిరంజీవి, రజినీకాంత్, తరుణ్ ఇలా చాలామంది స్టార్ హీరోల సినిమాలు థియేటర్లో రీ రిలీజ్ అయ్యి బాగా సందడి చేశాయి. ఇక అభిమానులు ఆ సినిమాలు చూస్తూ మరోసారి థియేటర్లో హైప్ క్రియేట్ చేశారు. అయితే ఇదంతా పక్కన పెడితే సీనియర్ ఎన్టీఆర్ నటించిన ‘అడవి రాముడు’ మరోసారి రీ రిలీజ్ కావటానికి సిద్ధంగా ఉంది.


1977లో సీనియర్ ఎన్టీఆర్ కు బ్లాక్ బస్టర్ హిట్ అందించిన సినిమా ‘అడవి రాముడు’. ఈ సినిమాకు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఇందులో జయప్రద, జయసుధ హీరోయిన్ లుగా నటించారు. ఇక ఈ సినిమాకు బాలసుబ్రమణ్యం నేపథ్య గానం అందించగా మహదేవన్ సంగీతం అందించారు. అప్పట్లో ఈ సినిమాను సత్య చిత్రం నిర్మాణ సంస్థ నిర్మించింది. ఈ సినిమాను అప్పటి ప్రేక్షకులు చూసి ఓ రేంజ్ లో ఫిదా అయ్యారని చెప్పాలి.


రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ‘సింహాద్రి’ సినిమాను విడుదల చేయగా.. నందమూరి అభిమానులు థియేటర్లో ఎంతల రచ్చ చేశారో చూసాం. ఈ సినిమా ఏకంగా 1200 కు పైగా థియేటర్స్ లో విడుదలై హంగామ సృష్టించింది. అయితే మే 28న సీనియర్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ‘అడవి రాముడు’ సినిమాను ఫోర్ కే వెర్షన్ లో రీ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.


అయితే ఈ సినిమా రీ రిలీజ్ కేవలం అమెరికా వరకు మాత్రమే పరిమితం అయిందని తెలిసింది. అమెరికాలో ఏకంగా 75 సెంటర్స్ లో ‘అడవి రాముడు’ విడుదల చేయనున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రీ రిలీజ్ చేస్తారో లేదో అనుమానాలు రావడంతో నందమూరి అభిమానులు ఫీల్ అవుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ సినిమాతో బజ్ క్రియేట్ చేసిన నందమూరి అభిమానులు.. సీనియర్ ఎన్టీఆర్ సినిమాతో మరింత బజ్ క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి అన్న గారి సినిమాను తెలుగు ప్రేక్షకుల కోసం తెలుగులో విడుదల చేస్తారు లేదో చూడాలి. ఎన్టీఆర్ జయంతి వేడుకలకు సమయం మరెన్నో రోజులు లేవు. మరి, దీనిపై ఎన్టీఆర్ అభిమానులు, నందమూరి ఫ్యామిలీ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.


జూనియర్ ఎన్టీఆర్ ‘సింహాద్రి’ రీరిలీజ్‌కు అదిరిపోయే కలెక్షన్స్


ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో భారీ అంచనాల నడుమ 9 జులై 2003వ సంవత్సరంలో విడుదలైన 'సింహాద్రి'(Simhadri) మరో సారి ట్రెండింగ్ లో నిలిచింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) పుట్టినరోజు సందర్భంగా మే 20న మేకర్స్ ఇటీవలే మరోసారి థియేటర్లలో రిలీజ్ చేశారు. భూమిక చావ్లా , అంకిత హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా.. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి 'సింహాద్రి' అదే కలెక్షన్లను కొనసాగిస్తోంది. విడుదలైన తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.5.2 కోట్ల గ్రాస్ వసూళ్లను దక్కించుకుంది. దీంతో 'సింహాద్రి' 'ఆల్ టై రికార్డ్ సినిమా'ల జాబితాలో మరోసారి చేరిపోయింది.



Read Also: పవన్ - సాయి తేజ్ - ఇంతకీ ఇద్దరిలో దేవుడెవరు 'బ్రో'?