నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఈ రోజు విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ జయంతి (NTR Jayanthi) సందర్భంగా కొత్త లుక్ విడుదల చేశారు. ఆల్రెడీ విడుదల చేసిన బాలకృష్ణ ఫస్ట్ లుక్ నందమూరి అభిమానులను మాత్రమే కాక, తెలుగు ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు మాస్ పోస్టర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.


బాలకృష్ణ సరసన శ్రుతీ హాసన్ (Shruti Hassan) కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో హానీ రోజ్ రెండో కథానాయిక. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు. మోడల్ కమ్ హీరోయిన్, 'చీకటి గదిలో చితకొట్టుడు' ఫేమ్ చంద్రికా రవి ప్రత్యేక గీతంలో స్టెప్పులు వేశారు.


మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతోంది. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలు. ముసలి మడుగు ప్రతాప్ రెడ్డి పాత్రలో కన్నడ స్టార్ దునియా విజయ్ విలన్ రోల్ చేస్తున్నారు. ఇంకా లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు ప్రధాన పాత్రలు చేస్తున్నారు. బాలకృష్ణ 107వ చిత్రమిది (NBK 107 Movie). ఈ సినిమాకు 'జై బాలయ్య' టైటిల్ ఖరారు చేసినట్టు టాక్. అయితే, ఆ విషయాన్ని ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.


Also Read: కృష్ణుడిగా 17 సినిమాల్లో - ఎన్టీ రామారావు సినీ జీవితంలో ఈ విశేషాలు మీకు తెలుసా?






గోపీచంద్ మలినేని సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ ఒక సినిమా చేయనున్నారు. తండ్రీ కుమార్తెల కథతో రూపొందుతోన్న ఆ సినిమా సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో సెట్స్ మీదకు వెళ్ళనుంది. బాలకృష్ణ ఇమేజ్, స్టార్‌డ‌మ్‌కు తగ్గట్టు ప‌వర్‌ఫుల్‌ క్యారెక్టర్‌తో కొత్త తరహా కథతో ఆ సినిమా రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 


Also Read: కృష్ణను స్టూడియో అంతా పరుగులు పెట్టించిన మహేష్ - అమ్మాయి గురించి నానా గొడవ