మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆరెంజ్' మూవీ ఇటీవల రీ రిలీజ్ అయి అదిరిపోయే రెస్పాన్స్ ని కనబరిచిన సంగతి తెలిసిందే. 2010 లో రిలీజ్ అయిన ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది  అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగా బ్రదర్ నాగబాబు ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమాలో చరణ్ సరసన జెనీలియా హీరోయిన్ గా నటించగా.. ప్రకాష్ రాజ్, ప్రభు, బ్రహ్మానందం, మంజుల నాయుడు తదితరులు ఇతర కీలకపాత్రను పోషించారు. హారీష్ జయరాజ్ ఈ చిత్రానికి సంగీతం అందించగా.. ఈ సినిమా పాటలు అప్పట్లో యూత్ ని ఓ ఊపు ఊపేసాయి. ఇప్పటికీ ఈ పాటలను లూప్ మోడ్ లో వైన్ శ్రోతలు చాలామందే ఉన్నారు.


మగధీర వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత భారీ అంచనాలతో వచ్చిన 'ఆరెంజ్' మూవీ ఫ్లాఫ్ టాక్ ని మూటగట్టుకోగా.. ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన నాగబాబుకి భారీ నష్టాలు కూడా వచ్చాయి. అయితే సినిమా రిలీజ్ అయిన కొన్నాళ్లకు కల్ట్ క్లాసిక్ మూవీ గా పేరు తెచ్చుకుంది. అందుకే ఫ్యాన్స్ కోరిక మేరకు ఈ మూవీని ఇటీవల రీ రిలీజ్ చేశారు. ఇక ఆరెంజ్ రీ రిలీజ్ కి ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. కలెక్షన్స్ కూడా భారీగానే వచ్చాయి. అయితే రీ రిలీజ్ సమయంలోనే ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ ని జనసేన పార్టీకి విరాళంగా అందిస్తామని నిర్మాత నాగబాబు ముందుగానే ప్రకటించారు. చెప్పినట్టుగానే తాజాగా జనసేన అధినేత సినీ నటుడు పవన్ కళ్యాణ్ కి ఆరెంజ్ రీ రిలీజ్ కలెక్షన్స్ ని చెక్ రూపంలో అందజేశారు. ఈ విషయాన్ని యువ నిర్మాత SKN తన ట్విట్టర్ వేదికగా తెలిపారు.


మెగా బ్రదర్ నాగబాబు దర్శకుడు సాయి రాజేష్, నిర్మాత ఎస్ కే ఎన్, తదితరులతో పవన్ కళ్యాణ్ ని కలిసి ఆరెంజ్ సినిమా ద్వారా వచ్చిన ఒక కోటి ఐదు లక్షల రూపాయలను చెక్ రూపంలో పవన్ కళ్యాణ్ కి అందజేశారు. రీ రిలీజ్ కు సంబంధించి ప్రింట్ల ఖర్చు, థియేటర్ల రెంట్లు ఇతర ఖర్చులు తీసివేయగా ఒక కోటి ఐదు లక్షల రూపాయలు మిగిలాయి. ఈ మొత్తాన్ని తాజాగా పవన్ కళ్యాణ్ కు అందజేశారు నాగబాబు. ఏదేమైనా ఆరెంజ్ మూవీకి రీ రిలీజ్ లో ఇంత మొత్తం రావడం నిజంగా విశేషం అనే చెప్పాలి. ఇక తాజాగా జనసేన పార్టీ నుంచి ఈ చెక్కు అందజేత విషయమై ఓ ప్రకటన కూడా విడుదల చేస్తూ..  ఆరెంజ్ రీ రిలీజ్ కలెక్షన్స్ ని జనసేన పార్టీకి విరాళంగా అందజేసిన మెగా బ్రదర్ నాగబాబుకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ తన కమిట్మెంట్స్ ని పూర్తి పూర్తిచేసే పనిలో ఉన్నాడు. అందులో భాగంగా ఇప్పటికే హరిహర వీరమల్లు, వినోదయ సీతం రీమేక్ షూటింగ్ పూర్తవగా.. ప్రస్తుతం OG, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రీకరణ జరుపుకుంటున్నాయి.


Also Read: కీర్తి సురేష్‌కు కాబోయే భర్త అతడేనా? వైరల్ అవుతోన్న ఫొటో