Thala Ajith : కోలీవుడ్ అగ్ర హీరోలు ఒక్కొక్కరుగా టాలీవుడ్ మేకర్స్ తో చేతులు కలుపుతున్న విషయం తెలిసిందే. ఈ లిస్టులో ధనుష్ మొదటి ప్లేస్ లో ఉన్నాడు. గత ఏడాది తెలుగులో స్ట్రైట్ సినిమా చేసి హిట్ కొట్టాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ధనుష్ తో తెరకెక్కించిన 'సార్' మూవీ మంచి కమర్షియల్ సక్సెస్ అందుకుంది. దాంతో తెలుగులో మరో క్లాసికల్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో ధనుష్ రెండవ సినిమా చేస్తున్నారు. ఈయన తర్వాత మరోసారి హీరో శివ కార్తికేయన్ జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్ తో ప్రిన్స్ అనే సినిమా తీశాడు. అటు దళపతి విజయ్ కూడా మన టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వారసుడు సినిమాలో నటించాడు.


అలా టాలీవుడ్ దర్శక నిర్మాతలతో కోలీవుడ్ అగ్ర హీరోలు సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో కోలీవుడ్ స్టార్ టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం టాలీవుడ్ లో టాప్ ప్రొడక్షన్ హౌస్ గా వెలుగొందుతున్న మైత్రి మూవీ మేకర్స్ తమిళ అగ్ర హీరో అజిత్ తో ప్రాజెక్ట్ ఓకే చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కి దర్శకుడిగా అధిక్ రవి చంద్రన్ వ్యవహరించబోతున్నారట. రీసెంట్ గానే ఈయన విశాల్ తో 'మార్క్ ఆంటోనీ' అనే సినిమా తెరకెక్కించాడు. తెలుగులో అంతగా ఆడలేదు కానీ ఒరిజినల్ వెర్షన్ మాత్రం బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంది.


రీసెంట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన ఈ మూవీకి తెలుగు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తమిళ ఆడియోన్స్ కి కనెక్ట్ అయ్యేలా అదిక్ రవిచంద్రన్ మార్క్ ఆంటోనీ మూవీ ని తెరకెక్కించడంతో ఈ చిత్రం కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల కలెక్షన్స్ అందుకుంది. ఇప్పుడు ఇదే డైరెక్టర్ అజిత్ తో సినిమా చేయబోతున్నారట. అధిక్ రవిచంద్రన్ అజిత్ కి వీరాభిమాని. ఈ విషయాన్ని ఆయనే ఎన్నోసార్లు బయటపెట్టారు. ఇప్పుడు తన అభిమాన హీరోని డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడంతో అజిత్ కుమార్‌తో మూవీని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రాజెక్ట్ ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.


కానీ మొత్తానికి ఈ కాంబినేషన్ లాక్ అయినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో న్యూస్ వినిపిస్తోంది. అజిత్ లాంటి స్టార్ ఇమేజ్ ఉన్న హీరోతో సినిమా నిర్మించడం ఒక విధంగా మైత్రి నిర్మాతలకి మంచి లాభం అని చెప్పొచ్చు. ఎందుకంటే అజిత్ కి ఉన్న మార్కెట్ పరంగా చూసుకుంటే రూ.200 కోట్ల వరకు రాబట్టే అవకాశం ఉంది. ఒకవేళ సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిందంటే 'విక్రమ్', 'జైలర్', 'లియో' కలెక్షన్స్ ని సైతం ఈజీగా బ్రేక్ చేసే కెపాసిటీ అజిత్ కి ఉందని చెప్పొచ్చు. కాగా అజిత్ తో అధిక రవిచంద్రన్ చేయబోయే సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది.


Also Read : ఒకే స్టూడియోలో, ఒకే సమయంలో - 21 ఏళ్ల తర్వాత అనుకోకుండా కలుసుకున్న కమల్, రజినీ


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply