MM Keeravaani: ఆస్కార్ విజేత సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి భారతదేశ 'గణతంత్ర దినోత్సవం 2026 పరేడ్' కోసం సంగీతం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. తెలుగుతోపాటు చాలా భాషల్లో అద్భుతమైన మ్యూజిక్ అందించిన కీరవాణికి ఎస్.ఎస్. రాజమౌళి చిత్రం 'ఆర్ఆర్ఆర్'తో అంతర్జాతీయ గుర్తింపు లభించింది. అందులో కంపోజ్ చేసిన 'నాటు నాటు' పాటతో ఆస్కార్‌ అవార్డు గెలుచుకున్నారు. ఇప్పుడు తన ప్రజాదరణతోనే జనవరి 26న నిర్వహించనున్న 77వ గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో 'వందేమాతరం'ను ప్రదర్శించడానికి సంగీతం సమకూరుస్తున్నారు.

Continues below advertisement

ఈ ప్రత్యేక ప్రాజెక్ట్‌ను సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించనున్నారు. నివేదికల ప్రకారం, ఈ దేశభక్తి గీతం ప్రదర్శనలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 2500 మంది కళాకారులు పాల్గొంటారు.  

తెలుగు సినిమాకు ఆయన చేసిన సేవకు గుర్తింపు

ఎం.ఎం. కీరవాణి పూర్తి పేరు కొడూరి మరాకతమణి కీరవాణి. ఎం.ఎం. కీరవాణి భారతదేశంలో ప్రసిద్ధ సంగీత దర్శకుడు, పాటల రచయిత , గాయకుడు. తెలుగు సినిమాకు ఆయన చేసిన సేవకు ఆయన ఎక్కువగా గుర్తింపు పొందారు. అయితే, ఆయన హిందీ, తమిళం, కన్నడ, మలయాళం సినిమాలకు కూడా సంగీతం అందించారు.

Continues below advertisement

ఎం.ఎం. కీరవాణి 4 జూలై 1961న ఆంధ్రప్రదేశ్‌లో జన్మించారు. 'ట్రిపుల్ ఆర్' సినిమాలోని 'నాటు నాటు' పాటకుగాను ఆయన 'ఆస్కార్ అవార్డు', 'గోల్డెన్ గ్లోబ్ అవార్డు'లను అందుకున్నారు. ఆయనకు అనేక జాతీయ చలనచిత్ర అవార్డులు, ఫిల్మ్‌ఫేర్ అవార్డులు కూడా లభించాయి.

'ట్రిపుల్ ఆర్'తో పాటు రాజమౌళి తీసిన'బాహుబలి- ది బిగినింగ్', 'బాహుబలి 2- ది కన్‌క్లూజన్', 'మగధీర' 'ఈగ' మర్యాద రామన్న వంటి సినిమాలకు కూడా ఆయన సంగీతం అందించారు. రాజమౌళి దాదాపు అన్ని పెద్ద సినిమాలకు కీరవాణి సంగీతం అందించారు. హిందీ సినిమాల విషయానికి వస్తే, ఆయన జఖ్మ్, జిస్మ్, పహేలీ, సుర్ వంటి సినిమాలలో మరపురాని సంగీతం అందించారు. ఎం.ఎం. కీరవాణి భారతీయ సంగీతాన్ని ప్రపంచ వేదికపైకి తీసుకువెళ్లారు. నేడు దేశంలోని అత్యంత గౌరవనీయమైన సంగీత దర్శకులలో ఒకరిగా గుర్తిస్తున్నారు.