విశాల్ ఎక్కువగా చేసేవి తమిళ సినిమాలు కావచ్చు. తమిళ దర్శకులు, సాంకేతిక నిపుణులతో పని చేస్తుండొచ్చు. కానీ, ఆయన మాత్రం తెలుగు యువకుడు. తెలుగు ప్రేక్షకులకు ఆయన అంటే అభిమానం. తెలుగు అంటే విశాల్ (Vishal)కూ ఎంతో మమకారం. అందుకని, తెలుగు ప్రేక్షకులనూ దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఆయన నటించిన తాజా సినిమా 'మార్క్ ఆంటోనీ' (Mark Antony Movie).


వినాయక చవితికి 'మార్క్ ఆంటోనీ'
విశాల్ అంటే ఎక్కువగా గుర్తుకు వచ్చేది యాక్షన్ సినిమాలు. ఆయన సినిమాలో యాక్షన్ కామన్. కానీ, కంటెంట్ కొత్తగా ఉండేలా చూసుకుంటారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త కథాంశాలతో సినిమాలు చేస్తుంటారు. ఇప్పుడీ 'మార్క్ ఆంటోనీ'ని సైన్స్ ఫిక్షన్ అండ్ హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ (Action Thriller)గా రూపొందించారు. ఈ సినిమాను వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 15న విడుదల చేయనున్నట్లు తెలిపారు.  


టైమ్ ట్రావెల్ థీమ్ నేపథ్యంలో 'మార్క్ ఆంటోనీ' తెరకెక్కింది. సైన్స్ ఫిక్షన్ అంశాలకు తోడు భారీ యాక్షన్ సన్నివేశాలు, వినోదంతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా సినిమా రూపొందించినట్లు చిత్ర బృందం పేర్కొంది. 


విశాల్ జోడీగా హైదరాబాదీ అమ్మాయి
'మార్క్ ఆంటోనీ'లో విశాల్ సరసన హైదరాబాదీ అమ్మాయి రీతూ వర్మ నటించారు. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన 'కనులు కనులు దోచాయంటే', 'ఒకే ఒక జీవితం', 'ఆకాశం' సినిమాలతో రీతూ వర్మ విజయాలు అందుకున్నారు. హ్యాట్రిక్ హిట్స్ నమోదు చేశారు. ఇప్పుడీ సినిమాతో డబుల్ హ్యాట్రిక్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు.


Also Read : బాలకృష్ణ అభిమాని... కలకత్తా వెళ్లి మరీ మార్టినెజ్‌తో ఫోటో, ఎవరీ మార్టినెజ్‌?


'మార్క్ ఆంటోనీ'లో ప్రముఖ నటుడు & దర్శకుడు ఎస్.జె. సూర్య, టాలీవుడ్ స్టార్ కమెడియన్ కమ్ వెర్సటైల్ యాక్టర్ సునీల్, మరో దర్శకుడు సెల్వ రాఘవన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అధిక్ రవిచంద్రన్ దర్శకుడు. ఎస్ వినోద్ కుమార్ నిర్మాణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడీ సినిమా పోస్ట్ ప్రొడక్షన్, చిత్రీకరణ పనులు చివరి దశలో ఉన్నాయి. 


ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న రెట్రో లుక్స్!
'మార్క్ ఆంటోనీ' ఫస్ట్ లుక్స్ ఆల్రెడీ విడుదల చేశారు. అవి చూస్తే... హీరో సహా మిగతా మెయిన్ లీడ్స్ అందరూ సరికొత్త రెట్రో లుక్‌లో కనిపించి సినిమాపై ఆసక్తి పెంచారు. ఇటీవల విడుదలైన టీజర్ సైతం ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన అందుకుంది. ముఖ్యంగా విశాల్ చాలా కొత్తగా కనిపించారు. గుబురు గడ్డంతో ఫైర్ చేస్తున్న విశాల్, ఎస్.జె. సూర్య కామెడీ టైమింగ్ ప్రేక్షకులను చాలా ఆకట్టుకున్నాయి. 


జీవీ ప్రకాష్ కుమార్ సంగీతంలో!
'మార్క్ ఆంటోనీ' చిత్రానికి సంగీతం జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఇంకా ఈ సినిమాకు పీటర్ హెయిన్స్, దిలీప్ సుబ్బరాయన్, కనల్ కణ్ణన్, దినేష్ సుబ్బరాయన్ యాక్షన్ సన్నివేశాలు సమకూర్చారు. అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీ అందించారు. విజయ్ వేలుకుట్టి ఎడిటింగ్ చేస్తున్నారు. ఈ సినిమాపై తెలుగులో కూడా అంచనాలు ఏర్పడ్డాయి. విశాల్ ఇమేజ్, ఆయన స్టోరీ సెలక్షన్ మీద ప్రేక్షకులకు నమ్మకం ఉండటంతో మంచి ఓపెనింగ్స్ రావడం ఖాయంగా కనబడుతోంది.  


Also Read పూజా హెగ్డేకు మరో ఛాన్స్ ఇస్తున్న త్రివిక్రమ్ - ఈసారి హీరో ఎవరంటే?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial