Ustaad Latest Promo : టాలీవుడ్ రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ఇటీవల హోస్ట్ అవతారం ఎత్తిన విషయం తెలిసిందే. ప్రముఖ ఓటీటీ ఈటీవీ విన్ కోసం 'ఉస్తాద్' అనే సరికొత్త సెలబ్రిటీ గేమ్ షోను మంచు మనోజ్ హోస్ట్ చేస్తున్నాడు. ఈ షో ద్వారా టాలీవుడ్ సెలబ్రిటీస్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. రీసెంట్ గానే మొదలైన ఈ సెలబ్రిటీ గేమ్ షోలో మొదటి గెస్ట్ గా నాచురల్ స్టార్ నాని సందడి చేశారు. అందుకు సంబంధించిన ఎపిసోడ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు సెకండ్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు. 'ఉస్తాద్' షోకి సెకండ్ గెస్ట్ గా యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ హాజరయ్యారు.


ఇందుకు సంబంధించిన ప్రోమో ఆడియన్స్‌ని ఆద్యంతం ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డిజె టిల్లుతో కలిసి మంచి మనోజ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ని అందించాడు. ఇక ఈ ప్రోమోలో మనోజ్ సిద్దు అని అడిగే కొన్ని ప్రశ్నలు, సిద్దు ఇచ్చిన ఆన్సర్స్ హైలెట్ గా నిలిచాయి. ప్రోమోని గమనిస్తే.. మనోజ్, సిద్దు ఇద్దరు కలిసి DJ టిల్లు టైటిల్ సాంగ్ కి డాన్స్ చేసి ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ‘‘సిద్ధూ ఏ స్క్రిప్ట్ అయినా కిస్ తో స్టార్ట్ చేస్తావంట కదా’’ అంటూ ఆన్ స్క్రీన్ పై లిప్ లాక్ ఫోటోలను రివీల్ చేశాడు మనోజ్. దానికి సిద్ధూ నవ్వేశాడు. డీజే టిల్లు రాధిక లాగా నిజ జీవితంలో ఎవరైనా తగిలారా? అని అడిగాడు.


ప్రోమోలో మనోజ్, సిద్ధు మధ్య జరిగిన సంభాషణ నవ్వులు పూయించింది. ఎప్పటిలాగే మనోజ్ తనదైన స్టైల్ లో కామెడీని పంచాడు. రెగ్యులర్ గా అన్ని షోల్ మాదిరిగా కాకుండా తనకి ఇష్టం వచ్చినట్లు సెట్ లో తిరగేస్తూ సోఫాలపై పడుకుంటూ మనోజ్ అల్లరి చేస్తుంటే.. ‘‘ఇది షో లాగ లేదు ఆయన ఇంట్లో సోఫాపై దొర్లినట్టు ఉంది’’ అంటూ సిద్ధూ చెప్పడం మరింత నవ్వులు పూయించింది. ఇక ప్రోమో చివర్లో 'ప్యార్ మే పడిపోయానే' అనే సాంగ్ ని మనోజ్ పాడుతుంటే సిద్దు దానికి తబలా వాయించడం హైలెట్ గా నిలిచింది. దీంతో ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ అవుతుంది. 


కాగా ఇండస్ట్రీలో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ కెరీర్ మొదలు పెట్టిన సిద్దు జొన్నలగడ్డ 'DJ టిల్లు' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఈ సినిమా హీరోగా సిద్దుకి భారీ గుర్తింపును తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఈ హీరో వరుస అవకాశాలతో బిజీబిజీగా ఉన్నాడు. ఇప్పటికే DJ టిల్లు సీక్వెల్‌ను రెడీ చేశాడు. 'టిల్లు స్క్వేర్' అనే పేరుతో తెరకెక్కిన ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో పాటూ నీరజ కోన దర్శకత్వంలో 'తెలుసు కదా' అనే సినిమాలో నటిస్తున్నాడు.


Also Read : కథ వినకుండానే నో చెప్పాడు, విజయ్ దళపతిపై దర్శకుడు లింగుస్వామి షాకింగ్ కామెంట్స్