Premalu Heroine Mamitha Baiju: ఒక భాషలో సినిమా హిట్ అయితే రీమేక్ చేయడానికి ఇతర భాషల నిర్మాతలు క్యూ కడతారు. అదే విధంగా ఒక భాషలో నటిగా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్‌ను కూడా తమ ఇండస్ట్రీకి తీసుకురావాలని ప్రొడ్యూసర్స్ ఆశపడతారు. ముఖ్యంగా టాలీవుడ్‌లో మలయాళ బ్యూటీలకు చాలా డిమాండ్ ఉంది. వారంటే ప్రేక్షకులకు కూడా ఒక ప్రత్యేకమైన ఇష్టం ఉంది. ఇప్పటికే అనుపమ పరమేశ్వరన్, సంయుక్త మీనన్ లాంటి నటీమణులు తెలుగులోనే ఎక్కువగా ఫేమ్ సంపాదించుకొని టాలీవుడ్‌లో సెటిల్ అయిపోయారు. ఇప్పుడు మరో మలయాళ ముద్దుగుమ్మ కూడా త్వరలోనే తెలుగులో ఎంట్రీకి సిద్ధమవుతుందని రూమర్స్ వైరల్ అవుతున్నాయి.


సూపర్ హిట్ ‘ప్రేమలు’..


తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో విడుదలయ్యి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న మలయాళ మూవీ ‘ప్రేమలు’. ఈ సినిమా షూటింగ్ అంతా దాదాపుగా హైదరాబాద్‌లోనే జరగడంతో తెలుగు ప్రేక్షకులు.. ఈ మూవీకి బాగా కనెక్ట్ అయ్యారు. అంతే కాకుండా నేరుగా మలయాళంలోనే విడుదలయినా కూడా చాలామంది తెలుగు ప్రేక్షకులు.. ఈ సినిమాను చూడడానికి నేరుగా థియేటర్లకు వెళ్లడం విశేషాలు. ఇప్పటికే ‘ప్రేమలు’ను డబ్ చేయాలా లేదా రీమేక్ చేయాలా అనే ఆలోచనతో టాలీవుడ్ నిర్మాతలు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఇంతలోనే ఇందులో హీరోయిన్‌గా నటించిన మమితా బైజుకు టాలీవుడ్‌లో డిమాండ్ మొదలయ్యింది.


క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంట్రీ..


కేరళలోని కొట్టాయంలో పుట్టి పెరిగింది మమితా. 2017లో ‘సర్వోపరి పాలక్కారన్’ అనే చిత్రంతో నటిగా మొదటిసారి వెండితెరపై వెలిగింది. అప్పటివరకు క్యారెక్టర్ ఆర్టిస్టుగానే సినిమాలు చేస్తూ వెళ్లిన మమితాకు 2021లో విడుదలయిన ‘ఆపరేషన్ జావా’ మంచి బ్రేక్ ఇచ్చింది. ఇందులో కూడా తను మెయిన్ హీరోయిన్‌గా నటించలేదు. కానీ స్క్రీన్‌పై ఉన్నంతసేపు తన నటనతో ఆకట్టుకుంది. దీంతో తనకు సెకండ్ హీరోయిన్ ఆఫర్లు ఇవ్వడం మొదలుపెట్టారు మేకర్స్. ఇక మొదటిసారి తను సోలో హీరోయిన్‌గా నటించిన చిత్రమే ‘ప్రేమలు’. దీంతో తనకు మలయాళంలోనే కాదు.. తెలుగులో కూడా క్రేజ్ పెరిగిపోయింది. ఎలాగైనా తనను టాలీవుడ్‌కు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు మొదలుపెట్టారు.


తమిళంలో డెబ్యూ..


కెరీర్ ప్రారంభమయినప్పటి నుండి కేవలం మలయాళ సినిమాల్లోనే నటించింది మమితా. కానీ త్వరలోనే తను నటించిన మొదటి తమిళ చిత్రం విడుదలకు సిద్ధమయ్యింది. జీవీ ప్రకాశ్ సరసన ‘రెబెల్’ అనే చిత్రంలో నటించి మొదటిసారి తమిళ ప్రేక్షకులను పలకరించనుంది ఈ మలయాళ భామ. తాజాగా గిరీష్ ఏడీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రేమలు’లో రీను రాయ్‌గా తన నటనతో యూత్‌ను ఫిదా చేసింది. అందుకే తనకు అలాంటి తరహా పాత్రలే ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అన్ని కరెక్ట్‌గా సెట్ అయితే తనకు మరిన్ని తమిళ సినిమా అవకాశాలతో పాటు తెలుగులో కూడా తను డెబ్యూ చేయనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఎందరో మలయాళ హీరోయిన్లను ఆదరించిన తెలుగు ప్రేక్షకులు మమితాను కూడా ఆదరిస్తారని ‘ప్రేమలు’ ఫ్యాన్స్ నమ్ముతున్నారు.


Also Read: పోలీసులను ఆశ్రయించిన నటి విద్యాబాలన్ - వాళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్