Pushpa The Rule Update: ప్రస్తుతం ఎన్నో పాన్ ఇండియా సీక్వెల్స్ కోసం దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ అంతా ఎదురుచూస్తున్నారు. అందులో ‘పుష్ప ది రూల్’ కూడా ఒకటి. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పుష్ప ది రైజ్’.. 2021 డిసెంబర్‌లో విడుదలయ్యింది. ఇక ఈ మూవీ విడుదలయ్యి రెండున్నర సంవత్సరాలు దాటిపోయినా.. ఇంకా సెకండ్ పార్ట్‌ షూటింగ్ దశలోనే ఉండడం ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేస్తోంది. అందుకే కొన్నిరోజుల క్రితం ‘పుష్ప ది రూల్’ విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. తాజాగా విడుదల తేదీ కోసం ప్రేక్షకులను ఎదురుచూడమంటూ ఒక పోస్ట్‌ను షేర్ చేసింది మూవీ టీమ్.


ఆసక్తికర అప్డేట్..


‘‘పుష్ప రాజ్ తన రూల్‌ను మొదలుపెట్టడానికి ఇంకా 200 రోజులు ఉంది. 2024, ఆగస్ట్ 15న ‘పుష్ప: ది రూల్’ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవ్వనుంది’’ అంటూ మూవీ టీమ్ సోషల్ మీడియాలో కౌంట్ డౌన్ షేర్ చేసింది. రిలీజ్ విషయంలో అస్సలు వెనక్కి తగ్గేదేలే అని స్పష్టం చేసింది. ఇటీవల ‘పుష్ప ది రూల్’ విడుదల తేదీని ప్రకటించడంతో పాటు చిన్న గ్లింప్స్‌ను కూడా విడుదల చేశారు మేకర్స్. ఆ తర్వాత ఒకట్రెండు పోస్టర్లు బయటికొచ్చాయి. అంతకు మించి ఈ మూవీ షూటింగ్ గురించి ఎలాంటి అప్డేట్ బయటికి రాలేదు. ఇప్పటికీ సుకుమార్ గానీ, అల్లు అర్జున్ గానీ ‘పుష్ప ది రూల్’ షూటింగ్ గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడం ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేస్తోంది. తాజాగా విడుదల చేసిన అప్డేట్ చూసి ఇంకా 200 రోజులు ఎదురుచూడాలి అంటూ ఫ్యాన్స్ కౌంట్‌డౌన్ మొదలుపెట్టారు.






ఒక్క డైలాగ్, స్టెప్‌తో హైప్..


‘పుష్ప ది రైజ్’ సినిమా తెలుగులో మాత్రమే కాకుండా నార్త్‌లో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ముందుగా ఈ మూవీ నుంచి శ్రీవల్లి అనే పాట విడుదలయ్యింది. అందులో అల్లు అర్జున్ చేసిన స్టెప్‌ను ముందుగా నెటిజన్లు ట్రోల్ చేశారు. కానీ అదే స్టెప్ సినిమా నుంచి క్రికెట్ వరకు అందరు సెలబ్రిటీలలో హైప్ క్రియేట్ చేసింది. ఆఖరికి చాలామంది క్రికెటర్లు క్రికెట్ గ్రౌండ్‌లో కూడా ఇదే స్టెప్‌ను వేసేవారు. దాంతో పాటు సినిమాల్లో అల్లు అర్జున్ మ్యానరిజంతో ‘తగ్గేదే లే’ అంటూ చెప్పే డైలాగ్ కూడా ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఫారిన్ దేశాల్లో కూడా ఈ డైలాగ్‌ను చెప్తూ.. అల్లు అర్జున్ మ్యానరిజంను ఇమిటేట్ చేశారు నెటిజన్లు. 


పోస్ట్ ప్రొడక్షన్‌పై ఫోకస్..


‘పుష్ప ది రైజ్’ ప్రపంచాన్ని షేక్ చేయడంతో ఇప్పుడు ఈ మూవీ సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. మొదటి భాగం సెన్సేషన్ క్రియేట్ చేసింది కాబట్టి రెండో భాగం.. దానికి మించి ఉండాలని మేకర్స్‌పై ఒత్తిడి పెరిగిపోయింది. అందుకే షూటింగ్ విషయంలో ఎక్స్‌ట్రా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ‘పుష్ప ది రైజ్’ సమయంలో తెలుగుతో పాటు హిందీ రిలీజ్‌ను కూడా ఒకేసారి ప్లాన్ చేశారు మేకర్స్. దీంతో చివరి నిమిషంలో పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో తీవ్రంగా ప్రెజర్ పడింది. ఈసారి అలా జరగకుండా షూటింగ్‌ను త్వరగా పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్‌ను మరింత జాగ్రత్తగా చేయాలి అనుకునే ఆలోచనలో టీమ్ ఉన్నట్టు సమాచారం.


Also Read: స్టూడెంట్‌ను చెప్పుతో చితకబాదిన సీనియర్ సింగర్ - స్పందించిన చిన్మయి