సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) మధ్య సఖ్యత లేదని ఫిల్మ్ నగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వీళ్ళిద్దరి కలయికలో సినిమా లేటెస్ట్ షెడ్యూల్ మరింత ఆలస్యంగా స్టార్ట్ కానుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 


SSMB 28 సినిమాపై, మహేష్ - త్రివిక్రమ్ మధ్య బాండింగ్ గురించి జరుగుతున్న ప్రచారాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఖండించారు. అయితే, మహేష్ బాబు మరోసారి ఫారిన్ టూర్ వేయడం ఆ ప్రచారానికి బలం చేకూర్చేలా ఉందని చెప్పాలి. 


మళ్ళీ ఫారిన్ వెళ్లిన మహేష్!
జనవరి నుంచి మార్చి నెలాఖరు వరకు త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న తాజా సినిమా చిత్రీకరణలో మహేష్ బాబు పాల్గొన్నారు. ఆ తర్వాత పారిస్ వెళ్లారు. భార్య నమ్రత, కుమార్తె సితార ఆమె కంటే ముందు వెళ్లారు. ఆ తర్వాత మహేష్, గౌతమ్ వెళ్లి జాయిన్ అయ్యారు. కొన్నాళ్లకు తిరిగి వచ్చారు. లేటెస్టుగా... ఈ రోజు (ఏప్రిల్ 28న) ఉదయం మహేష్ బాబు ఫ్యామిలీ మళ్ళీ ఫారిన్ వెళ్ళింది.


Also Read : 'ఏజెంట్' సినిమా రివ్యూ : అయ్యగారు అఖిల్‌ని నంబర్ వన్ చేసేలా ఉందా? లేదా?






మహేష్ బాబు, త్రివిక్రమ్ మధ్య ప్రస్తుతం గొడవలు జరుగుతున్నాయని ఓ సెక్షన్ ఆఫ్ మీడియా పేర్కొంది. త్రివిక్రమ్ పనితీరు పట్ల మహేష్ బాబు అసంతృప్తితో ఉన్నారని గుసగుసల సారాంశం. 


గతంలో సంగీత దర్శకుడిగా తమన్, కథానాయికగా పూజా హెగ్డే వద్దని మహేష్ బాబు చెబితే గురూజీ కన్వీన్స్ చేశారని... కథ మార్చమని కోరితే ఫుల్ స్క్రిప్ట్ చేంజ్ చేశారని... ఆల్రెడీ తీసిన ఫైట్స్ వద్దని చెబితే, ఏకంగా ఫైట్ మాస్టర్లను ఛేంజ్ చేశారని... ఇప్పుడు హీరో, హీరోయిన్ శ్రీలీల మీద తీసిన సీన్లు సరిగా రాలేదని, వాటిని పక్కనపెట్టి కొత్తగా తీద్దామని త్రివిక్రమ్ చెబితే మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారని ఓ సెక్షన్ ఆఫ్ మీడియా చెబుతోంది. సదరు వార్తలను నిర్మాత రాధాకృష్ణ సోదరుని కుమారుడు, సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ ఖండించారు. అది జరిగిన మర్నాడు మహేష్ ఫారిన్ టూర్ వేయడం గమనార్హం. 



అటెన్షన్ కోసం రాస్తున్న రూమర్స్!
''ఆహారం కోసం వెతికేటప్పుడు పక్షులు గట్టిగా శబ్దం చేస్తాయి. ఎవరైనా అటెన్షన్ కోసం ట్రై చేసేటప్పుడు అదే విధంగా రూమర్స్ స్ప్రెడ్ చేస్తారు. వాటిని చూసి నవ్వుకోవడం లేదంటే పట్టించుకుండా వదిలేయడం సులభమే. మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సూపర్ ఫ్యాన్స్... SSMB 28 సినిమా ఎప్పటికీ గుర్తు పెట్టుకునేలా ఉంటుంది. మీరు వినాలనుకునేది వినండి. కానీ, ఈ స్టేట్మెంట్ గుర్తు పెట్టుకోండి'' అని నాగవంశీ ట్వీట్ చేశారు. 
 
మహేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తాజా సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకం మీద సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. మహేష్ తండ్రి, దివంగత సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మే 11న టైటిల్ అనౌన్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్. నవీన్ నూలి ఎడిటర్ కాగా... ఎఎస్ ప్రకాష్ కళా దర్శకత్వం వహిస్తున్నారు. 


Also Read : 'వ్యవస్థ' రివ్యూ : దీన్ని కోర్టు రూమ్ డ్రామా అంటారా? ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?