తెలుగు రాష్ట్రాల్లో భీమ్లా నాయక్ ( Bheemla Naik ) సినిమా సందడి కనిపిస్తోంది. అనంతపురం జిల్లాలో కియా ( KIA )పరిశ్రమలో పని చేస్తున్న వారంతా మూకుమ్మడిగా సెలవు పెట్టడంతో  పరిశ్రమ సెలవు ప్రకటించింది. సినిమా చూసేందుకు సెలవు పెడుతున్నామని వారంతా కంపెనీ యాజమాన్యానికి లేఖ  రాశారు. వెంటనే కంపెనీ యాజమాన్యం సెలవు ( Holiday ) ప్రకటించింది. అయితే ఆదివారం వర్కింగ్ డేగా ( Working Day ) ప్రకటించి షాక్ ఇచ్చింది.


పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా విడుదల సందర్బంగా  శుక్రవారం ( Friday ) సెలవు కావాలంటూ కియ హెచ్ ఆర్ కు 400 మంది లైన్ సైడ్ వర్కర్స్ లెటర్ ( Line Side Workers ) రాశారు.   కేసారి  ఏకంగా 400 మంది కియ పరిశ్రమలో పనిచేసే లైన్ సైడ్ వర్కర్స్ సెలవు పెట్టడంతో  రోబోలు సర్వీస్ చేయాల్సి ఉన్నందున మేము మూడు రోజుల ముందే 25 -2-2022 తేదిన  సెలవు ఇవ్వాలని నిర్ణయించా రు. ఈ మేరకు కంపెనీ ఉద్యోగులకు  హెచ్ ఆర్ డిపార్ట్ మెంట్ నోటీసు పంపింది.


 ప్రతి నెలలో ఒక రోజు నో ఫ్రొడక్షన్ డే ( No Production Day ) గా వర్కర్లకు సెలవు ప్రకటిస్తుంది యాజమాన్యం.  ఆ సెలవును శుక్రవారానికి సర్దుబాటు చేసింది. శుక్రవారం సెలవు ప్రకటించినందున ఆదివారం ( Sunday ) వర్కర్స్ పని చేయాలని  కియ యాజమాన్యం స్పష్టం చేసింది. కంపెనీ కూడా సెలవు ఇవ్వడంతో అనంతపురం జిల్లా కొత్త చెరువులో సందీప్ సినిమా హాల్ లో కియా ఉద్యోగుల సందడి చేశారు. 400 మంది ఉద్యోగులు  బాణసంచా కాల్చి మరీ సినిమా చూశారు.  


అభిమాన తారల సినిమాలు విడుదలవుతున్న సందర్భంగా ఆఫీసుల్లో హాజరు తక్కువగా ఉండటం సహజమే.  అందుకే చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు అలాంటి సూపర్ స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతున్న సందర్భంలో హాలీడే ప్రకటిస్తూ ఉంటాయి. ఎక్కువగా రజనీకాంత్ ( Rajanikant ) సినిమాలకు ఇలాంటి సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. తమిళనాడులోని ( Tamilnadu ) పలు కంపెనీలు రజనీకాంత్ సినిమా విడుదల రోజున సెలవు ఇవ్వడమే కాదు.. ఉచితంగా టిక్కెట్లు కూడా ఉద్యోగులకు ఇస్తూ ఉంటాయి. ఇలాంటి అభిమానాన్ని పవన్ కల్యాణ్ ..ఏపీలో సంపాదించుకున్నారు.