బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) హైదరాబాద్‌లో ఉన్నారిప్పుడు! యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ 'ప్రాజెక్ట్ కె' (Project K)లో ఆయన నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన్ను 'ప్రాజెక్ట్ కె' చిత్ర బృందంలో కొంత మందితో పాటు టాలీవుడ్ సెలబ్రిటీలు కలిశారు.


అమితాబ్ బచ్చన్‌తో ప్రభాస్, ప్రశాంత్ నీల్, దర్శకేంద్రులు కె. రాఘవేంద్ర రావు, నేచురల్ స్టార్ నాని, దుల్కర్ సల్మాన్, నాగ్ అశ్విన్ కలిసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'ప్రాజెక్ట్ కె' కొత్త ఆఫీస్ ప్రారంభోత్సవంలో ఈ ఫోటో తీసినట్టు తెలుస్తోంది. ఇటీవల ఆ ఆఫీసు గృహ ప్రవేశం జరిగిందని తెలుస్తోంది. (Prabhas Project K New Office Launched Recently In Hyderabad)


Also Read : చిరంజీవి, పవన్ కళ్యాణ్... ఇద్దర్నీ 'రంగ రంగ వైభవంగా' టీజ‌ర్‌లో చూపించిన వైష్ణవ్ తేజ్


ప్రశాంత్ నీల్, నాగ్ అశ్విన్... ఇద్దరూ ప్రభాస్ సినిమాలు చేస్తున్నారు. రాఘవేంద్ర రావు, నాని వాళ్ళతో కలిశారు. ఈ ఫోటో విడుదలైన తర్వాత ప్రభాస్ లుక్స్ మీద ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది. ఆయన మళ్ళీ లావు అయ్యారని కొందరు అంటున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ ట్రోల్స్‌ను పట్టించుకోవడం లేదు. యంగ్ రెబల్ స్టార్ సింప్లిసిటీ గురించి చెబుతున్నారు. ఆఫ్ స్క్రీన్ షో చేయడని అంటున్నారు. 


Also Read : ప్రియాంకతో ఉన్నది బాయ్‌ఫ్రెండేనా - అమ్మ అడగడంతో అసలు విషయం చెప్పిన హీరోయిన్