Actress Kayadu Lohar Temparory Break From Social Media : హీరోయిన్స్కు సోషల్ మీడియాలో ఉండే ఫేం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొందరు ఎప్పటికప్పుడు ఇన్ స్టాలో యాక్టివ్గా ఉంటూ ఫోటో షుట్స్ చేస్తుంటారు. మరికొందరు ఇన్ స్టా, సోషల్ మీడియాకు దూరంగా ఉంటారు. యంగ్ హీరోయిన్ కయాదు లోహర్ ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ఆమె కీలక నిర్ణయం తీసుకున్నారు.
సోషల్ మీడియాకు బ్రేక్
కొద్ది రోజులు ఇన్ స్టా, సోషల్ మీడియా నుంచి బ్రేక్ తీసుకోనున్నట్లు పోస్ట్ చేశారు కయాదు లోహర్. 'కొన్నిసార్లు మనం శరీరానికి ఇచ్చే విశ్రాంతి లాంటిదే మన మనసుకు కూడా అవసరం. కాస్త నెమ్మదించాలని, కొంతకాలం పాటు అన్నింటికీ దూరంగా ఉండాలని, స్క్రీన్కు అతీతంగా నాతో నేను, నా జీవితంతో ఎక్కువ టైం గడపాలని నాకు అనిపిస్తోంది. నాకు సపోర్ట్ చేసిన, ప్రోత్సహించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు.
మీ సందేశాలు, మీ ప్రేమ మీరు ఊహించనంతగా నాకు అర్థాన్నిచ్చాయి. నేను కొంతకాలం పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉంటాను. కానీ ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ నా టీం పోస్ట్ చేస్తుంది. త్వరలో మళ్లీ కలుద్దాం.' అంటూ రాసుకొచ్చారు.
కన్నడ మూవీ ముగిల్ పేటతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చారు కయాదు లోహర్. మలయాళం, కన్నడ, తమిళం సహా తెలుగు మూవీస్లోనూ అవకాశాలు అందుకున్నారు. తెలుగులో శ్రీవిష్ణు అల్లూరితో ఎంట్రీ ఇచ్చారు. రీసెంట్గా విశ్వక్ సేన్ ఫంకీ మూవీలోనూ నటించారు. లేటెస్ట్గా మలయాళం పళ్లిచట్టంబిలో నటించారు. ప్రస్తుతం నేచరల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న ది ప్యారడైజ్లో హీరోయిన్గా చేస్తున్నారు. ఇందులో సుబ్బలక్ష్మి పాత్రలో నటిస్తున్నారు. వరుస ప్రాజెక్టుల నేపథ్యంలో సోషల్ మీడియాకు బ్రేక్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
Also Read : 'దీవానా' రివ్యూ: తెలుగులో ఇటువంటి ప్రేమకథ రాలేదా? 'శుభం' ఫేమ్ హర్షిత్ రెడ్డి సినిమా ఎలా ఉందంటే?
