బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ప్రభాస్ కి జోడిగా 'ఆదిపురుష్' మూవీలో సీతగా ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మరో కొత్త అవతారం ఎత్తింది. ఇప్పటికే బాలీవుడ్ లో ఇండస్ట్రీలో  హీరోయిన్ స్టార్ స్టేటస్ అందుకున్న కృతి సనన్ ఇప్పుడు మరో కొత్త అవతారమెత్తింది. తాజాగా తాను నిర్మాతగా మారుతున్నట్లు సోషల్ మీడియాలో పేర్కొంటూ తన ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను తెలియజేసింది. 'బ్లూ బటర్ ఫ్లై' అనే ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేస్తూ నిర్మాతగా 'దో పట్టి' అనే సినిమాను నిర్మించబోతున్నట్లు ప్రకటించింది. ఈ ప్రాజెక్టు కోసం ముగ్గురు స్ఫూర్తిదాయకమైన, అపారమైన ప్రతిభావంతులైన మహిళలతో తాను జతకట్టినట్టు వెల్లడించింది.


ఇక ఈ ఈ మూవీని కృతి సనన్ నిర్మించడమే కాకుండా కాజల్ తో కలిసి నటిస్తోంది. ఈ మేరకు కృతి సనన్ సోషల్ మీడియాలో ప్రొడక్షన్ హౌస్ లోగో రీల్ తో పాటు బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్, స్క్రీన్ ప్లే రైటర్ కనికా దిల్లాన్, రిచికాకపూర్ తో ఉన్న పిక్ని షేర్ షేర్ చేసింది. 'దోపట్టి' అనే సినిమా మిస్టరీగా రాబోతుందని, 8 ఏళ్ల విరామం తర్వాత 'దిల్ వాలే' లో  రోహిత్ శెట్టి కాజోల్ తో తిరిగి తాను వస్తున్నట్టు పేర్కొంది. ఇక కృతిసనన్ నిర్మాణరంగంలోకి అడుగుపెట్టడమే కాకుండా ఈ మూవీ కోసం నెట్ ఫ్లిక్స్ ను ఎంచుకున్నట్టు తెలిపింది.


" నా తొమ్మిది సంవత్సరాల కలల సహకారంలో బేబీ స్టెప్స్ వేశాను. నేర్చుకున్నాను. యాక్టర్ గా ఎదిగాను. ఫిలిం మేకింగ్ లోనే ప్రతి అంశాన్ని ఇష్టపడ్డాను. ఇప్పుడు నాకు ఇష్టమైన నచ్చిన, ఆశాజనకంగా ఉండే మరిన్ని కథలను చెప్పడానికి మరింత తెలుసుకోవడానికి సమయం వచ్చేసింది. ఈ మ్యాజికల్ జర్నీ ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ" కృతి ప్రతి సనన్ పేర్కొంటూ తన సోదరి నుపూర్ సనన్ ని ట్యాగ్ చేస్తూ 'బిగ్ డ్రీమ్ కి స్వాగతం' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దీంతో ఈ పోస్ట్ కాస్త వైరల్ అవ్వడంతో ఫాన్స్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు ప్రతి సనన్ నిర్మాతగా సక్సెస్ అవ్వాలని ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.


ఇక సినీ ప్రముఖుల్లో బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్, హ్యూమ ఖురేషీ, శోభిత ధూళిపాల, దర్శకుడు ఆనంద్ ఎల్ రాయి తదితరులు కృతి సనన్ కి కంగ్రాట్స్ చెప్పారు. కాగా ఇటీవల 'ఆదిపురుష్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కృతి సనన్. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ మూవీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయినా మొదటి మూడు రోజుల్లోనే రూ.300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. సినిమాలో సీత పాత్రలో కృతి సనన్ నటనకి విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం కరీనా కపూర్, టబు లతో కలిసి 'ది క్రూ' అనే సినిమాతోపాటు టైగర్ ష్రాఫ్  తో కలిసి 'గణపతి పార్ట్- 1' లో నటిస్తోంది. వీటిల్లో 'ది క్రూ' ఈ ఏడాది చివర్లో విడుదల కాబోతుండగా.. టైగర్ ష్రాఫ్ 'గణపతి పార్ట్ -1' వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.


Also Read : మెగాస్టార్ మూవీని రిజెక్ట్ చేసిన DJ టిల్లు - అతని స్థానంలో మరో యంగ్ హీరోకి ఛాన్స్!






Join Us on Telegram: https://t.me/abpdesamofficial