Janhvi Kapoor About Tirupati: అతిలోక సుందరి శ్రీదేవిపై ఉన్న అభిమానంతో తన వారసురాలు జాన్వీ కపూర్‌ను కూడా మన ఇంటి అమ్మాయిగా ఒప్పుకున్నారు తెలుగు ప్రేక్షకులు. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి, అక్కడ తన టాలెంట్ ఏంటో ఇప్పటికే నిరూపించుకుంది జాన్వీ. కానీ తెలుగులో మాత్రం తను ఇంకా ఒక్క సినిమా కూడా చేయలేదు. అయినా కూడా అప్పుడే తనకు తెలుగులో కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ప్రతీ స్పెషల్ సందర్భానికి తిరుపతికి వెళ్లే జాన్వీ కపూర్.. తాజాగా తన తిరుపతి అంటే ఎంత స్పెషల్ అని బయటపెట్టింది. ఒక ఈవెంట్‌లో తిరుపతిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.


సమాధానం ఊహించవచ్చు..


‘‘మీరు మీ ఫ్యామిలీతో కలిసి చాలావరకు ప్రపంచాన్ని చూశారు. ఈ సమ్మర్‌లో ఇండియన్ ఫ్యామిలీ అంతా కలిసి ఒక చోటుకి వెళ్లాలి అంటే ఏ చోటుకి వెళ్లమని సలహా ఇస్తారు?’’ అంటూ జాన్వీ కపూర్‌కు ప్రశ్న ఎదురయ్యింది. ‘‘ప్రత్యేకంగా ఈ సమ్మర్ గురించి అడిగితే నేను చెప్పలేను. ఎందుకంటే ప్రతీ ప్రాంతంలోని ప్రజలు ఎండల వల్ల, వాతావరణం వల్ల ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అయినా కూడా అందరు వెళ్లమని సలహా ఇచ్చే ప్రాంతం అయితే ఒకటి ఉంది. నా నోటి నుంచి ఈ సమాధానం వస్తుందని చాలామంది ఊహించవచ్చు. అదే తిరుపతి’’ అని చెప్తూ నవ్వింది జాన్వీ కపూర్.


తెలుసుకోవడం ముఖ్యం..


తిరుపతి అంటే తనకు ఎంత స్పెషల్ అని చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్. ‘‘నేను అయితే తిరుపతికి ప్రతీ కొన్ని నెలలకు ఒకసారి వెళ్తుండాలి. అక్కడికి వెళ్లిన ప్రతీసారి చాలా బాగుంటుంది. నాకు నేను ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. అది నన్ను ప్రశాంతంగా ఫీల్ అయ్యేలా చేస్తుంది. నా రూట్స్ ఏంటని చాలా రకాలుగా గుర్తుచేస్తుంది. నా వరకు అలాంటి ప్రాంతం తిరుపతి. కానీ మీకు మీ రూట్స్ ఏంటని గుర్తుచేసే ప్రాంతానికి వెళ్లడం మంచిదని నేను అనుకుంటాను. మీరు ఎక్కడికి నుంచి వచ్చారు, మీ పూర్వీకులు ఎవరు అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. అది మీరు ఎవరు అని తెలుసుకునే ధైర్యాన్ని మీకు ఇస్తుంది’’ అంటూ తిరుపతి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది జాన్వీ కపూర్.


బ్యాక్ టు బ్యాక్ సినిమాలు..


సినిమాల విషయానికొస్తే జాన్వీ కపూర్.. అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్‌లో కూడా బిజీగా గడిపేస్తోంది. ప్రస్తుతం హిందీలో జాన్వీ నటించిన ‘మిస్టర్ అండ్ మిసేస్ మహి’, ‘ఉలఝ్’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వచ్చే మూడు నెలల్లో ఈ రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. తెలుగులో ఎన్‌టీఆర్ సరసన నటిస్తున్న ‘దేవర’తో డెబ్యూ సిద్ధమయ్యింది ఈ భామ. ఈ మూవీ ఇప్పటికే విడుదల అవ్వాల్సి ఉన్నా పలు కారణాల వల్ల వాయిదాలు పడుతూ వస్తోంది. ‘దేవర’ విడుదల కాకపోయినా రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీలో కూడా జాన్వీ కపూరే హీరోయిన్‌గా ఎంపికయ్యింది.



Also Read: అనిల్‌ను ముసుగేసి కొడితే పదివేలు ఇస్తా, రాజమౌళి షాకింగ్ కామెంట్స్ - రావిపూడి రియాక్షన్ ఇదే!