Mahesh Babu Rajamouli Movie Update: ‘ఆర్ఆర్ఆర్’లాంటి సెన్సేషనల్ సినిమాను తెరకెక్కించిన తర్వాత రాజమౌళి తరువాతి స్టెప్ ఏంటి అని ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూశారు. ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబులాంటి స్టార్‌తో మూవీ ఉంటుందని ప్రకటించడంతో ఈ కాంబినేషన్‌పై అందరిలో భారీ అంచనాలు పెరిగిపోయాయి. అయితే ప్రస్తుతం మహేశ్.. ‘గుంటూరు కారం’ షూటింగ్‌లో బిజీగా ఉండడంతో రాజమౌళి కూడా కథను పూర్తిస్థాయిలో సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రాజమౌళి, మహేశ్ మూవీకి సంబంధించి పలు రూమర్స్.. సినీ సర్కిల్లో వైరల్ అవ్వగా.. తాజాగా వైరల్ అవుతున్న ఒక అప్డేట్ ఫ్యాన్స్‌ను సంతోషపెడుతోంది.


మొదటిసారి అంత బడ్జెట్..
మహేశ్ బాబు, రాజమౌళి సినిమాను అనౌన్స్ చేసి చాలాకాలం అవ్వడంతో అప్పటినుండి ఇప్పటివరకు ఎన్నో రకాల రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా మరికొన్ని రూమర్స్ కూడా ట్రెండింగ్‌లోకి వచ్చాయి. ఈ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మూవీకి రూ.1000 కోట్ల బడ్జెట్ అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఏ తెలుగు చిత్రం కూడా అంత బడ్జెట్‌తో తెరకెక్కలేదని ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. అయితే మొదటినుండి బడ్జెట్ విషయంలో రిస్కులు తీసుకోవడం రాజమౌళికి అలవాటే. ఒక తెలుగు సినిమా రూ.100 కోట్లను కలెక్ట్ చేయడం కష్టమని ఇండస్ట్రీ నిపుణులు సైతం భావిస్తున్న రోజుల్లోనే ఆ రేంజ్ బడ్జెట్‌తో సినిమాలు తెరకెక్కించడం మొదలుపెట్టాడు రాజమౌళి.


జనవరి చివరి నుండే..
ఇక మహేశ్ కోసం పూర్తిస్థాయి కథ సిద్ధమయిన తర్వాత షూటింగ్ ప్రారంభించే ముందు ఒక ప్రెస్ మీట్ పెట్టి.. మూవీకి సంబంధించిన విశేషాలను అందరితో పంచుకోనున్నాడట రాజమౌళి. తన ముందు సినిమాలకు కూడా దర్శక ధీరుడు ఇదే ఫార్మాట్‌ను ఫాలో అయ్యాడు. ఇక జనవరిలో ‘గుంటూరు కారం’ విడుదలవుతుంది కాబట్టి జనవరి చివరి వారం వరకు స్క్రిప్ట్‌ను పూర్తి చేసి ప్రీ ప్రొడక్షన్‌ను ప్రారంభించాలని మూవీ టీమ్ భావిస్తుందని సమాచారం. ఇక ఈ మూవీకి రైటర్‌గా పనిచేస్తున్న విజయేంద్ర ప్రసాద్ కూడా ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. మహేశ్‌తో తెరకెక్కించనున్న సినిమాతో ఇప్పటివరకు ఇండియన్ సినిమా ప్రేక్షకులు చూడని ఒక కొత్త ప్రపంచాన్ని రాజమౌళి ఆవిష్కరిస్తాడని ఆయన బయటపెట్టారు.


సీక్వెల్ ఉంటుందా..?
మహేశ్, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కే మూవీ ప్రపంచాన్ని చుట్టేసే వ్యక్తి కథ అని ఇప్పటికే దర్శకుడు హింట్ ఇచ్చాడు. అయితే ఈ కథ అమెజాన్ అడవుల బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని విజయేంద్ర ప్రసాద్ బయటపెట్టారు. ఈ కథలో ఫారిన్ నటీనటులు కూడా కనిపించే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఇక ఇప్పటికే ఈ మూవీలో నటించే ఫారిన్ నటీనటులు వీరే అంటూ పలువురి పేర్లు బయటికి వచ్చాయి. కానీ అవన్నీ రూమర్స్ అని తేలిపోయింది. అయితే ఈ మూవీ కూడా రెండు భాగాలుగా విడుదల అవుతుందా అని ప్రశ్నించగా.. సీక్వెల్‌కు అవకాశం ఉండేలా సినిమా ముగుస్తుందని రివీల్ చేశారు విజయేంద్ర ప్రసాద్. ఇక ఈ సినిమాకు కావాల్సిన లొకేషన్స్‌ను ఇప్పటికే ఫైనల్ చేయగా.. అక్కడ షూటింగ్ చేయడానికి అనుమతుల కోసం మూవీ టీమ్ ప్రయత్నాలు మొదలుపెట్టింది.


Also Read: మహేష్ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్, నటుడిగా వేణు స్వామి ఫ్లాప్ షో - అందుకే, ఇండస్ట్రీ మీద పడ్డారా?